ETV Bharat / sports

శ్రేయస్ సూపర్ శతకం.. రెండో వన్డేలో దక్షిణాఫ్రికాపై టీమ్ఇండియా విక్టరీ

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. శ్రేయస్ అయ్యర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

author img

By

Published : Oct 9, 2022, 9:03 PM IST

Updated : Oct 9, 2022, 9:26 PM IST

INDIA VS SA 2ND ODI RESULT
INDIA VS SA 2ND ODI RESULT

సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్​లో భారత్ గొప్పగా పుంజుకుంది. తొలి వన్డేలో త్రుటిలో ఓటమిపాలైన ధావన్​సేన.. రెండో మ్యాచ్​లో సఫారీలు నిర్దేశించిన 279 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 45.5 ఓవర్లలోనే ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ చక్కని శతకంతో చెలరేగిన వేళ.. టీమ్ఇండియా సునాయాసంగా విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమం అయింది. భారత బ్యాటింగ్‌లో శ్రేయస్‌(113*)తో పాటు ఇషాన్‌ కిషన్‌ (93) రాణించాడు. త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. శుభ్‌మన్‌(28), సంజు శాంసన్‌(30*) ఫర్వాలేదనిపించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో వ్యాన్‌ పార్నెల్, కగిసో రబాడ, ఫొర్టైన్‌ తలో వికెట్‌ తీశారు.

INDIA VS SA 2ND ODI RESULT
శ్రేయస్ అయ్యర్

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. ఆచితూచిగా ఆడింది. మ్యాచ్​లో మెరుగ్గా బౌలింగ్ చేసిన భారత బౌలర్ మహ్మద్ సిరాజ్.. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో వికెట్ తీసి శుభారంభం చేశాడు. కెరీర్​లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన షాబాజ్ అహ్మద్.. పదో ఓవర్​లో మరో ఓపెనర్ మలన్​ను(25) వెనక్కి పంపించాడు. ఇక ఆ తర్వాత వచ్చిన మార్​క్రమ్(79), వన్​డౌన్ బ్యాటర్ హెండ్రిక్స్(74) సమయోచితంగా ఇన్నింగ్స్​ను నడిపించారు. అడపాదడపా బౌండరీలు కొడుతూ.. స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని సిరాజ్ విడగొట్టాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో క్లాసెన్(30), మిల్లర్(35*) ఫర్వాలేదనిపించారు. చివర్లో భారత బౌలర్లు మెరుగ్గా బంతులు వేసి.. స్కోరు భారీగా పెరగకుండా చూశారు. మొత్తంగా ఏడు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా 278 పరుగులు చేసింది.

INDIA VS SA 2ND ODI RESULT
శ్రేయస్ అయ్యర్

ఛేదనలో భారత్​కు శుభారంభమేమీ దక్కలేదు. సారథి శిఖర్ ధావన్ 20 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఉన్నంతసేపు ధాటిగా ఆడిన శుభ్​మన్ గిల్(28) సైతం.. త్వరగానే ఔట్ అయిపోయాడు. ఈ దశలో యువ బ్యాటర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ భారత ఇన్నింగ్స్​ను నిలబెట్టారు. ఇషాన్ దూకుడుగా ఆడగా.. శ్రేయస్ కాస్త సంయమనం పాటించాడు. సఫారీ బౌలర్లకు అవకాశమే ఇవ్వకుండా చక్కటి బ్యాటింగ్​తో వీరిద్దరూ అలరించారు. ఈ క్రమంలో మూడో వికెట్​కు 160 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. 93 పరుగుల వద్ద ఉండగా ఇషాన్.. ఓ భారీ షాట్​కు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే, అప్పటికే భారత్ పటిష్ఠ స్థితికి చేరింది. దీంతో శ్రేయస్ అయ్యర్.. సాధికారతతో బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ క్రమంలోనే వన్డేలో రెండో శతకాన్ని నమోదు చేశాడు. చివర్లో శాంసన్(30) ఆకట్టుకున్నాడు. దీంతో 25 బంతులు ఉండగానే భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. సిరీస్ సమం కాగా.. మూడో వన్డే అక్టోబర్ 11న దిల్లీలో జరగనుంది.

INDIA VS SA 2ND ODI RESULT
.

సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్​లో భారత్ గొప్పగా పుంజుకుంది. తొలి వన్డేలో త్రుటిలో ఓటమిపాలైన ధావన్​సేన.. రెండో మ్యాచ్​లో సఫారీలు నిర్దేశించిన 279 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 45.5 ఓవర్లలోనే ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ చక్కని శతకంతో చెలరేగిన వేళ.. టీమ్ఇండియా సునాయాసంగా విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమం అయింది. భారత బ్యాటింగ్‌లో శ్రేయస్‌(113*)తో పాటు ఇషాన్‌ కిషన్‌ (93) రాణించాడు. త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. శుభ్‌మన్‌(28), సంజు శాంసన్‌(30*) ఫర్వాలేదనిపించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో వ్యాన్‌ పార్నెల్, కగిసో రబాడ, ఫొర్టైన్‌ తలో వికెట్‌ తీశారు.

INDIA VS SA 2ND ODI RESULT
శ్రేయస్ అయ్యర్

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. ఆచితూచిగా ఆడింది. మ్యాచ్​లో మెరుగ్గా బౌలింగ్ చేసిన భారత బౌలర్ మహ్మద్ సిరాజ్.. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో వికెట్ తీసి శుభారంభం చేశాడు. కెరీర్​లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన షాబాజ్ అహ్మద్.. పదో ఓవర్​లో మరో ఓపెనర్ మలన్​ను(25) వెనక్కి పంపించాడు. ఇక ఆ తర్వాత వచ్చిన మార్​క్రమ్(79), వన్​డౌన్ బ్యాటర్ హెండ్రిక్స్(74) సమయోచితంగా ఇన్నింగ్స్​ను నడిపించారు. అడపాదడపా బౌండరీలు కొడుతూ.. స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని సిరాజ్ విడగొట్టాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో క్లాసెన్(30), మిల్లర్(35*) ఫర్వాలేదనిపించారు. చివర్లో భారత బౌలర్లు మెరుగ్గా బంతులు వేసి.. స్కోరు భారీగా పెరగకుండా చూశారు. మొత్తంగా ఏడు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా 278 పరుగులు చేసింది.

INDIA VS SA 2ND ODI RESULT
శ్రేయస్ అయ్యర్

ఛేదనలో భారత్​కు శుభారంభమేమీ దక్కలేదు. సారథి శిఖర్ ధావన్ 20 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఉన్నంతసేపు ధాటిగా ఆడిన శుభ్​మన్ గిల్(28) సైతం.. త్వరగానే ఔట్ అయిపోయాడు. ఈ దశలో యువ బ్యాటర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ భారత ఇన్నింగ్స్​ను నిలబెట్టారు. ఇషాన్ దూకుడుగా ఆడగా.. శ్రేయస్ కాస్త సంయమనం పాటించాడు. సఫారీ బౌలర్లకు అవకాశమే ఇవ్వకుండా చక్కటి బ్యాటింగ్​తో వీరిద్దరూ అలరించారు. ఈ క్రమంలో మూడో వికెట్​కు 160 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. 93 పరుగుల వద్ద ఉండగా ఇషాన్.. ఓ భారీ షాట్​కు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే, అప్పటికే భారత్ పటిష్ఠ స్థితికి చేరింది. దీంతో శ్రేయస్ అయ్యర్.. సాధికారతతో బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ క్రమంలోనే వన్డేలో రెండో శతకాన్ని నమోదు చేశాడు. చివర్లో శాంసన్(30) ఆకట్టుకున్నాడు. దీంతో 25 బంతులు ఉండగానే భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. సిరీస్ సమం కాగా.. మూడో వన్డే అక్టోబర్ 11న దిల్లీలో జరగనుంది.

INDIA VS SA 2ND ODI RESULT
.
Last Updated : Oct 9, 2022, 9:26 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.