ETV Bharat / sports

'కోహ్లీ కూడా మనిషే.. ప్రతిసారి సెంచరీ కష్టమే'

author img

By

Published : Aug 23, 2021, 3:49 PM IST

ఫామ్​లేమితో బాధపడుతున్న టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి మద్దతుగా నిలిచాడు మాజీ క్రికెటర్​ ఫరూక్ ఇంజినీర్. బ్యాటింగ్​కు దిగిన ప్రతిసారి కోహ్లీ నుంచి సెంచరీ ఆశించడం సరికాదని తెలిపాడు. విరాట్​ కూడా అందరిలా మనిషేనని.. తప్పులు చేయడం సహజమని పేర్కొన్నాడు.

virat kohli
విరాట్ కోహ్లీ

ఫామ్​లేమితో సతమతమవుతున్న టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి మద్దతుగా నిలిచాడు మాజీ వికెట్​కీపర్​ ఫరూక్​ ఇంజనీర్​. కోహ్లీపై భారీ అంచనాలు ఉంటున్నాయని.. బ్యాటింగ్​కు దిగిన ప్రతిసారి అతడి నుంచి సెంచరీని ఆశించడం సబబుకాదని పేర్కొన్నాడు. విరాట్​ కూడా అందరిలా మనిషేనని తెలిపాడు. టెస్టుల్లో అతడిప్పటికి 40, 50 పరుగులు సాధిస్తున్నాడని చెప్పాడు.

కోహ్లీ.. చివరిసారిగా 2019 నవంబర్​లో బంగ్లాతో జరిగిన డై/నైట్​ టెస్టులో శతకాన్ని అందుకున్నాడు. 2020 నుంచి అతనాడిన 10 టెస్టుల్లో 407 పరుగులు సాధించాడు. కోహ్లీ కెరీర్​ సగటు 51.41 కాగా, 2020 నుంచి ఇప్పటివరకు 23.94 సగటుతో బ్యాటింగ్​ చేశాడు. ఇటీవల ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టెస్టులో గోల్డెన్​ డకౌట్​గా వెనుదిరిగిన విరాట్​.. లార్డ్స్​ టెస్టులో రెండు ఇన్నింగ్స్​ల్లో వరుసగా 42, 20 రన్స్​ కొట్టాడు. దీంతో అతడి బ్యాటింగ్​పై చర్చ నడుస్తోంది.

తాజాగా ఈ విషయమై ఓ స్పోర్ట్స్​ ఛానల్​తో మాట్లాడిన ఫరూక్​.. ఇంగ్లాండ్​ సారథి జో రూట్​ నిలకడగా పరుగులు చేస్తున్న చోట విరాట్​ విఫలమవుతున్నాడని పేర్కొన్నాడు. "అలా అని కోహ్లీని నిందించినట్లు కాదు. ఇప్పటికీ అతడు గొప్ప ఆటగాడు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్​మెన్​లలో విరాట్​ ఒకడు. అందరిలో కోహ్లీ ఒకడు. ఎందుకంటే అతడు పరుగులు సాధిస్తున్నాడు. రూట్​ ఎక్కువ పరుగులు చేస్తున్నాడు. అతడు బ్యాటింగ్​కు దిగిన ప్రతిసారి సెంచరీ ఆశించడం సరికాదు. ఆటకు తోడు అదృష్టం కూడా కలిసిరావాలి. అతడు కూడా మనిషే. మనిషి అనేవాడు తప్పులు చేయడం సహజం. విరాట్​ కూడా అంతే. దురదృష్టవశాత్తూ ఔట్​ అవుతున్నాడు" అని ఫరూక్​ తెలిపాడు.

కోహ్లీ దూకుడు భారత క్రికెట్​కు మంచే చేస్తుందని ఫరూక్​ అభిప్రాయపడ్డాడు. తాను కూడా దూకుడుగా ఉండటాన్ని ఇష్టపడతానని తెలిపాడు. విరాట్​ వంటి వాళ్లని చూసి గర్వించాలని పేర్కొన్నాడు. సొంత గడ్డపై ఇంగ్లాండ్​ను ఓడించడం గొప్ప విషయమని స్పష్టం చేశాడు.

లార్డ్స్​ వేదికగా జరిగిన రెండో టెస్టులో అనూహ్యంగా భారత్​ విజయం సాధించింది. ఆఖరి రోజు చివరి రెండు సెషన్లలో ఇంగ్లిష్ జట్టును 120 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో 151 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న విరాట్ సేన.. ఐదు మ్యాచ్​ల సిరీస్​లో 1-0తో ముందంజ వేసింది. తదుపరి టెస్టు లీడ్స్​ వేదికగా ఆగస్టు 25 నుంచి ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి: క్రికెట్​కు తాలిబన్ల మద్దతు.. టీ20 ప్రపంచకప్​లో అఫ్గాన్​!

ఫామ్​లేమితో సతమతమవుతున్న టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి మద్దతుగా నిలిచాడు మాజీ వికెట్​కీపర్​ ఫరూక్​ ఇంజనీర్​. కోహ్లీపై భారీ అంచనాలు ఉంటున్నాయని.. బ్యాటింగ్​కు దిగిన ప్రతిసారి అతడి నుంచి సెంచరీని ఆశించడం సబబుకాదని పేర్కొన్నాడు. విరాట్​ కూడా అందరిలా మనిషేనని తెలిపాడు. టెస్టుల్లో అతడిప్పటికి 40, 50 పరుగులు సాధిస్తున్నాడని చెప్పాడు.

కోహ్లీ.. చివరిసారిగా 2019 నవంబర్​లో బంగ్లాతో జరిగిన డై/నైట్​ టెస్టులో శతకాన్ని అందుకున్నాడు. 2020 నుంచి అతనాడిన 10 టెస్టుల్లో 407 పరుగులు సాధించాడు. కోహ్లీ కెరీర్​ సగటు 51.41 కాగా, 2020 నుంచి ఇప్పటివరకు 23.94 సగటుతో బ్యాటింగ్​ చేశాడు. ఇటీవల ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టెస్టులో గోల్డెన్​ డకౌట్​గా వెనుదిరిగిన విరాట్​.. లార్డ్స్​ టెస్టులో రెండు ఇన్నింగ్స్​ల్లో వరుసగా 42, 20 రన్స్​ కొట్టాడు. దీంతో అతడి బ్యాటింగ్​పై చర్చ నడుస్తోంది.

తాజాగా ఈ విషయమై ఓ స్పోర్ట్స్​ ఛానల్​తో మాట్లాడిన ఫరూక్​.. ఇంగ్లాండ్​ సారథి జో రూట్​ నిలకడగా పరుగులు చేస్తున్న చోట విరాట్​ విఫలమవుతున్నాడని పేర్కొన్నాడు. "అలా అని కోహ్లీని నిందించినట్లు కాదు. ఇప్పటికీ అతడు గొప్ప ఆటగాడు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్​మెన్​లలో విరాట్​ ఒకడు. అందరిలో కోహ్లీ ఒకడు. ఎందుకంటే అతడు పరుగులు సాధిస్తున్నాడు. రూట్​ ఎక్కువ పరుగులు చేస్తున్నాడు. అతడు బ్యాటింగ్​కు దిగిన ప్రతిసారి సెంచరీ ఆశించడం సరికాదు. ఆటకు తోడు అదృష్టం కూడా కలిసిరావాలి. అతడు కూడా మనిషే. మనిషి అనేవాడు తప్పులు చేయడం సహజం. విరాట్​ కూడా అంతే. దురదృష్టవశాత్తూ ఔట్​ అవుతున్నాడు" అని ఫరూక్​ తెలిపాడు.

కోహ్లీ దూకుడు భారత క్రికెట్​కు మంచే చేస్తుందని ఫరూక్​ అభిప్రాయపడ్డాడు. తాను కూడా దూకుడుగా ఉండటాన్ని ఇష్టపడతానని తెలిపాడు. విరాట్​ వంటి వాళ్లని చూసి గర్వించాలని పేర్కొన్నాడు. సొంత గడ్డపై ఇంగ్లాండ్​ను ఓడించడం గొప్ప విషయమని స్పష్టం చేశాడు.

లార్డ్స్​ వేదికగా జరిగిన రెండో టెస్టులో అనూహ్యంగా భారత్​ విజయం సాధించింది. ఆఖరి రోజు చివరి రెండు సెషన్లలో ఇంగ్లిష్ జట్టును 120 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో 151 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న విరాట్ సేన.. ఐదు మ్యాచ్​ల సిరీస్​లో 1-0తో ముందంజ వేసింది. తదుపరి టెస్టు లీడ్స్​ వేదికగా ఆగస్టు 25 నుంచి ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి: క్రికెట్​కు తాలిబన్ల మద్దతు.. టీ20 ప్రపంచకప్​లో అఫ్గాన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.