ETV Bharat / sports

'టెస్టు ఛాంపియన్​షిప్​ పాయింట్ల విధానం సరికాదు'

author img

By

Published : May 4, 2020, 10:39 AM IST

టెస్టు ఛాంపియన్​షిప్​లో ఐదు మ్యాచ్​ల సిరీస్, రెండు మ్యాచ్​ల సిరీస్​కు ఒకేలా పాయింట్లు కేటాయించడం కరెక్ట్ పద్ధతి కాదని అభిప్రాయం వ్యక్తం చేశాడు దిగ్గజ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్.

'టెస్టు ఛాంపియన్​షిప్​ పాయింట్ల విధానం సరికాదు'
దిగ్గజ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్

ఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో పాయింట్ల విధానం సరైనది కాదని అన్నాడు వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్. ఈ పద్ధతిలో మార్పులు చేయాలని సూచించాడు.

"టెస్టు ఛాంపియన్​షిప్​లోని పాయింట్ల విధానం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఐదు మ్యాచ్​ల సిరీస్​, రెండు మ్యాచ్​ల సిరీస్​లకు ఒకేలా పాయింట్లు కేటాయించడం ఎంతవరకు సబబు. తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు మాత్రమే ఫైనల్​కు వెళ్తాయి. మిగిలిన వారికి అవకాశం ఉండదు. అలాంటప్పుడు వెనకున్న జట్ల మధ్య టెస్టు జరుగుతుంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఏముంటుంది" -మైకేల్ హోల్డింగ్, విండీస్ మాజీ క్రికెటర్

Michael Holding
దిగ్గజ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్

ప్రతి రెండేళ్లకొకసారి జరిగే టెస్టు ఛాంపియన్​షిప్​లోని ప్రతి సిరీస్​కు 120 పాయింట్లు కేటాయించారు. సిరీస్​లో రెండు మ్యాచ్​లుంటే చెరో టెస్టుకు 60 పాయింట్లు, ఐదుంటే చెరో టెస్టుకు 24 పాయింట్లు కేటాయిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న టోర్నీ ఫైనల్​.. 2021 జూన్​లో లార్డ్స్ వేదికగా జరగనుంది.

ఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో పాయింట్ల విధానం సరైనది కాదని అన్నాడు వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్. ఈ పద్ధతిలో మార్పులు చేయాలని సూచించాడు.

"టెస్టు ఛాంపియన్​షిప్​లోని పాయింట్ల విధానం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఐదు మ్యాచ్​ల సిరీస్​, రెండు మ్యాచ్​ల సిరీస్​లకు ఒకేలా పాయింట్లు కేటాయించడం ఎంతవరకు సబబు. తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు మాత్రమే ఫైనల్​కు వెళ్తాయి. మిగిలిన వారికి అవకాశం ఉండదు. అలాంటప్పుడు వెనకున్న జట్ల మధ్య టెస్టు జరుగుతుంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఏముంటుంది" -మైకేల్ హోల్డింగ్, విండీస్ మాజీ క్రికెటర్

Michael Holding
దిగ్గజ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్

ప్రతి రెండేళ్లకొకసారి జరిగే టెస్టు ఛాంపియన్​షిప్​లోని ప్రతి సిరీస్​కు 120 పాయింట్లు కేటాయించారు. సిరీస్​లో రెండు మ్యాచ్​లుంటే చెరో టెస్టుకు 60 పాయింట్లు, ఐదుంటే చెరో టెస్టుకు 24 పాయింట్లు కేటాయిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న టోర్నీ ఫైనల్​.. 2021 జూన్​లో లార్డ్స్ వేదికగా జరగనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.