కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడా కార్యక్రమాలు నిలివేశారు. దాదాపుగా రెండు నెలల తర్వాత ఇప్పుడిప్పుడే టోర్నీల నిర్వహణకు అడుగులు పడుతున్నాయి. జర్మనీలో శనివారం నుంచి ఫుట్బాల్ మ్యాచ్లు ప్రారంభం అవ్వబోతున్నాయి. క్రికెటర్లను ఐసోలేషన్లో ఉంచి టోర్నీలు నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయిస్తోంది.
ఇలాంటి సమయంలో అంతర్జాతీయ మ్యాచ్ల కంటే దేశవాళీ టోర్నీలపై దృష్టి సారించాలని టీమ్ఇండియా కోచ్ రవిశాస్త్రి సూచించాడు. క్రికెటర్లంతా మైదానంలోకి వచ్చి దేశవాళీ క్రికెట్కు పూర్వవైభవం తీసుకురావాలని కోరాడు.
ప్రపంచకప్ కంటే అదే బెటర్
ప్రపంచకప్ లేదా ద్వైపాక్షిక సిరీస్ అనే అంశాన్ని ఎంచుకోవాల్సి వస్తే తాను కచ్చితంగా ద్వైపాక్షిక పర్యటనల వైపే మొగ్గు చూపుతానని రవిశాస్త్రి అన్నాడు. ఎందుకంటే 15 జట్లు కలిసే కంటే రెండు టీమ్లతో సిరీస్ను ఆడటం మేలని తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచకప్ కంటే దేశవాళీ, ద్వైపాక్షిక సిరీస్లు నిర్వహించడం వల్ల తక్కువ రిస్క్ ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఇదీ చూడండి.. ఐపీఎల్ జరిగితే జీతాల్లో కోతలు ఉండవు: గంగూలీ