దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. వైరస్ నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. ఈ పోరుకు మద్దతు తెలుపుతూ పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, క్రీడా సంస్థలు తమ వంతు సాయం చేస్తున్నాయి. తాజాగా ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ కూడా దాతృత్వాన్ని చాటుకుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా 10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది.
"సన్ టీవీ గ్రూప్ (సన్రైజర్స్ హైదరాబాద్) కరోనా నియంత్రణ చర్యలకు మద్దతు తెలుపుతుంది. ఉపశమన చర్యల్లో భాగంగా 10 కోట్ల సాయం ప్రకటిస్తున్నాం."
-సన్రైజర్స్ ట్వీట్
గత వారం బీసీసీఐ పీఎం కేర్స్కు 51 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. క్రికెటర్లు సచిన్, రైనా, కోహ్లీ, రోహిత్ శర్మ తదితరులు కూడా తమ వంతు సాయం చేశారు.
-
Sun TV Group (SunRisers Hyderabad) is donating Rs.10 Crores towards Corona Covid-19 relief measures. #COVID19 #CoronaUpdate
— SunRisers Hyderabad (@SunRisers) April 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sun TV Group (SunRisers Hyderabad) is donating Rs.10 Crores towards Corona Covid-19 relief measures. #COVID19 #CoronaUpdate
— SunRisers Hyderabad (@SunRisers) April 9, 2020Sun TV Group (SunRisers Hyderabad) is donating Rs.10 Crores towards Corona Covid-19 relief measures. #COVID19 #CoronaUpdate
— SunRisers Hyderabad (@SunRisers) April 9, 2020