ETV Bharat / sports

క్వారంటైన్​ పూర్తి.. ప్రాక్టీస్​కు ముగ్గురు ఇంగ్లీష్​​ ఆటగాళ్లు

ఇంగ్లాండ్​కు చెందిన ముగ్గురు​ ఆటగాళ్లు చెన్నైలోని చెపాక్​ స్టేడియంలో ప్రాక్టీస్​ మొదలుపెట్టారు. మిగతా టీమ్​ కంటే ముందు భారత్​ చేరుకున్న వీరికి.. మూడు సార్లు చేసిన కొవిడ్​ పరీక్షల్లో నెగెటివ్​గా తేలింది.

author img

By

Published : Jan 30, 2021, 1:11 PM IST

Updated : Jan 30, 2021, 2:04 PM IST

Stokes, Archer, Burns hit training ground as others in England squad clear second COVID test
ప్రాక్టీస్​ షురూ చేసిన స్టోక్స్, ఆర్చర్​, బర్న్స్​

ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ బెన్​ స్టోక్స్​, రిజర్వ్​ ఓపెనర్​ రోరీ బర్న్స్​, పేసర్​ జోఫ్రా ఆర్చర్​లు చెన్నైలోని చెపాక్​ స్టేడియంలో ప్రాక్టీస్​ మొదలుపెట్టారు. సహచర జట్టు సభ్యుల​ కంటే ముందుగా భారత్​ చేరుకున్న ఈ ముగ్గురు ఆటగాళ్లు.. ఆరు రోజుల క్వారంటైన్​ను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. రెండో విడత నిర్వహించిన కొవిడ్​ టెస్టులోనూ ఇంగ్లాండ్​ ఆటగాళ్లందరికీ నెగెటివ్​ రిపోర్టు వచ్చింది.

శ్రీలంక పర్యటనకు ఈ ముగ్గురు ఆటగాళ్లు అందుబాటులో లేరు. స్టోక్స్​, ఆర్చర్​లకు విశ్రాంతినిచ్చిన జట్టు యాజమాన్యం.. ఇటీవలే జన్మించిన తన పాపను చూడటానికి బర్న్స్​ను పక్కన పెట్టింది. ఈ ముగ్గురికి ఇప్పటికే మూడు సార్లు ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు నిర్వహించారు అధికారులు. అయితే మిగతా జట్టు సభ్యులకు ఫిబ్రవరి 2 నుంచి మైదానంలోకి అనుమతించనున్నారు.

" మొదటి విడతలో భారత్​కు వచ్చిన ఆర్చర్​, స్టోక్స్​, బర్న్స్​లు.. శనివారం నుంచి మూడు రోజుల పాటు, రోజు రెండు గంటల చొప్పున ప్రాక్టీస్​లో పాల్గొంటారు. రెండో విడత ఇంగ్లాండ్​ జట్టుకు చేసిన కరోనా పరీక్షల్లోనూ అందరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చింది."

- డాన్నీ రూబెన్​, ఇంగ్లాండ్​ మీడియా మేనేజర్​ ​

భారత్​, ఇంగ్లాండ్​ మధ్య ఫిబ్రవరి 5 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.​ తొలి రెండు మ్యాచ్​లు చెన్నై వేదికగా జరుగనున్నాయి.

ఇదీ చదవండి: 87 ఏళ్ల చరిత్రలో తొలిసారి 'రంజీ' టోర్నీ రద్దు

ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ బెన్​ స్టోక్స్​, రిజర్వ్​ ఓపెనర్​ రోరీ బర్న్స్​, పేసర్​ జోఫ్రా ఆర్చర్​లు చెన్నైలోని చెపాక్​ స్టేడియంలో ప్రాక్టీస్​ మొదలుపెట్టారు. సహచర జట్టు సభ్యుల​ కంటే ముందుగా భారత్​ చేరుకున్న ఈ ముగ్గురు ఆటగాళ్లు.. ఆరు రోజుల క్వారంటైన్​ను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. రెండో విడత నిర్వహించిన కొవిడ్​ టెస్టులోనూ ఇంగ్లాండ్​ ఆటగాళ్లందరికీ నెగెటివ్​ రిపోర్టు వచ్చింది.

శ్రీలంక పర్యటనకు ఈ ముగ్గురు ఆటగాళ్లు అందుబాటులో లేరు. స్టోక్స్​, ఆర్చర్​లకు విశ్రాంతినిచ్చిన జట్టు యాజమాన్యం.. ఇటీవలే జన్మించిన తన పాపను చూడటానికి బర్న్స్​ను పక్కన పెట్టింది. ఈ ముగ్గురికి ఇప్పటికే మూడు సార్లు ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు నిర్వహించారు అధికారులు. అయితే మిగతా జట్టు సభ్యులకు ఫిబ్రవరి 2 నుంచి మైదానంలోకి అనుమతించనున్నారు.

" మొదటి విడతలో భారత్​కు వచ్చిన ఆర్చర్​, స్టోక్స్​, బర్న్స్​లు.. శనివారం నుంచి మూడు రోజుల పాటు, రోజు రెండు గంటల చొప్పున ప్రాక్టీస్​లో పాల్గొంటారు. రెండో విడత ఇంగ్లాండ్​ జట్టుకు చేసిన కరోనా పరీక్షల్లోనూ అందరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చింది."

- డాన్నీ రూబెన్​, ఇంగ్లాండ్​ మీడియా మేనేజర్​ ​

భారత్​, ఇంగ్లాండ్​ మధ్య ఫిబ్రవరి 5 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.​ తొలి రెండు మ్యాచ్​లు చెన్నై వేదికగా జరుగనున్నాయి.

ఇదీ చదవండి: 87 ఏళ్ల చరిత్రలో తొలిసారి 'రంజీ' టోర్నీ రద్దు

Last Updated : Jan 30, 2021, 2:04 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.