ఇటీవలే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా విదేశీ లీగుల్లో ఆడేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు. అందుకోసం బీసీసీఐ అనుమతి కోరానని తెలిపాడు. అలాగే ధోనీ కెప్టెన్సీపైనా ప్రశంసలు కురిపించాడు.
"ప్రస్తుతం నేను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నా. బీసీసీఐలో కూడా భాగంగా ఉన్నా. ఇకపై విదేశీ లీగ్లలో ఆడాలనేది నా ఆలోచన. అందుకే బోర్డు సలహా తీసుకోవాలని భావిస్తున్నా. అనుమతి లభిస్తే మాత్రం ఆడేందుకు సిద్ధం. ధోనీ బౌలర్ల కెప్టెన్. అర్థం చేసుకునే కెప్టెన్ ఉంటే ఆట తేలికవుతుంది. ధోనీ ఎప్పుడూ ఆటపై స్పష్టతతో ఉంటాడు."
-ప్రజ్ఞాన్ ఓజా, టీమిండియా మాజీ క్రికెటర్
2008లో అరంగేట్రం చేసిన ఓజా.. 2013 వరకు అంతర్జాతీయ మ్యాచ్ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తంగా 24 టెస్టులు, 18 వన్డేలు, 8 టీ20లు ఆడాడు. టెస్టులో 113 వికెట్లు తీశాడు. దేశవాళీల్లో హైదరాబాద్కు, ఐపీఎల్లో దక్కన్ ఛార్జర్స్, ముంబయి ఇండియన్స్కు ఆడాడు. 2018లో బిహార్ తరఫున చివరి ఫస్ట్క్లాస్ మ్యాచ్లో పాల్గొన్నాడు.