" 2009 మార్చి 3.. లాహోర్లో శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఆ సమయంలో అంపైర్ అసన్రజా తీవ్రంగా గాయపడ్డాడు. అతడి ఊపిరితిత్తులు, కాలేయంలోకి రెండు బులెట్లు దిగాయి. ఫలితంగా కోమాలోకి వెళ్లిపోయాడు. శస్త్రచికిత్స తర్వాత కోలుకున్నా కొన్ని నెలల పాటు నడవలేకపోయాడు. ఏడాది కాలం తర్వాత మళ్లీ సాధారణ స్థితికి వచ్చిన అతడు.. అంపైరింగ్పై దృష్టిపెట్టాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత మళ్లీ అతడు మెల్బోర్న్ గ్రౌండ్లో ప్రపంచకప్ ఫైనల్లో అంపైర్గా పనిచేశాడు" అంటూ క్రికెట్ విశ్లేషకుడు రౌనక్ కపూర్.. అసన్ రజా గురించి చెప్పుకొచ్చాడు.
పాకిస్థాన్కు చెందిన మాజీ వికెట్కీపర్, బ్యాట్స్మన్ అసన్ రజా.. అలనాటి దుర్ఘటనపై నోరు విప్పాడు. "నా గాయాలు మానినా ఆనాటి ఘటనను గుర్తుచేసుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇప్పటికీ ఆ దాడి గురించి ఎవరైనా ప్రస్తావిస్తే దయచేసి మాట్లాడొద్దని చెప్తాను" అంటూ చెప్పుకొచ్చాడు.
సెమీఫైనల్లోనూ భారత్-ఇంగ్లాండ్ జట్టుకు అంపైర్గా బాధ్యతలు చేపట్టాల్సి ఉన్నా.. మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అయితే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన భారత్-ఆస్ట్రేలియా ఫైనల్కు మాత్రం రజా బాధ్యతలు నిర్వర్తించాడు.