ETV Bharat / sports

బయో సెక్యూర్ విధానంలో ఇంగ్లాండ్-పాక్ సిరీస్

author img

By

Published : May 17, 2020, 12:53 PM IST

ఇంగ్లాండ్​ పాకిస్థాన్​ మధ్య జులైలో జరగనున్న ద్వైపాక్షిక సిరీస్​ నిర్వహణ​కు ఇరు దేశాలు సన్నద్ధమయ్యాయి. ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాలని ఆ దేశాల క్రికెట్​ బోర్డ్​లు భావించాయి. దీని కోసం ఆటగాళ్లు ప్రత్యేక విమానాల్లో ఇంగ్లాండ్​ వెళతారని పీసీబీ ఛీఫ్​ వసీం ఖాన్​ తెలిపాడు.

Pakistan to tour England in July: matches to be played in bio-secure environment
ఇంగ్లాండ్​తో ద్వైపాక్షిక సిరీస్​కు పాక్​ గ్రీన్​ సిగ్నల్​​

పాకిస్థాన్​తో జులైలో జరగాల్సిన మూడు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్​లను బయో-సెక్యూర్​ వాతావరణంలో నిర్వహించాలని ఇంగ్లీష్​ క్రికెట్​ బోర్డు ప్రతిపాదించింది. ఈ నిర్ణయాన్ని సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్లు పాక్​ క్రికెట్​ బోర్డు కార్యనిర్వాహక అధ్యక్షుడు వసీం ఖాన్ తెలిపాడు.

రెండు దేశాల క్రికెట్​ బోర్డుల మధ్య జరిగిన సంభాషణల ప్రకారం స్టేడియం లోపల హోటళ్లు ఉన్న వాటిని ఎంపిక చేసి తలుపులు మూసేసి మ్యాచ్​లను నిర్వహించాలన్న ఇంగ్లాండ్​ ప్రతిపాదనను పాకిస్థాన్​ అంగీకరించింది.

క్రీడాకారుల ఆరోగ్యభద్రత ముఖ్యం

జులై మొదటి వారంలో 25 మంది ఆటగాళ్లు నాలుగు ప్రత్యేక విమానాల్లో ఇంగ్లాండ్​కు వెళతారని.. నిర్బంధ కాలం తర్వాత సిరీస్​ ప్రారంభించాలని అనుకుంటున్నట్లు పీసీబీ ఛీఫ్​ తెలిపాడు. అయితే ఈ ద్వైపాక్షిక సిరీస్​లో పాల్గొనాలని ఏ ఆటగాడిపై ఒత్తిడి తీసుకురాబోమని.. ఆట కంటే క్రీడాకారుల ఆరోగ్య భద్రత ముఖ్యమని అన్నాడు. ఒకవేళ తుది జట్టులో ఎంపిక చేసిన ఆటగాడు వెళ్లకూడదనుకుంటే వారి నిర్ణయాన్ని మేము గౌరవిస్తామని స్పష్టం చేశాడు. వారిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోమని వ్యాఖ్యానించాడు.

ప్రభుత్వ అనుమతి తీసుకుంటాం

ఈ పర్యటనకు ప్రభుత్వ అనుమతి కచ్చితంగా పొందుతామని పాక్​ క్రికెట్​ బోర్డు ఛీఫ్​ వసీం ఖాన్​ తెలిపాడు. టెస్టు సిరీస్​ కోసం మాంచెస్టర్​, సౌతాంప్టన్​ అనే రెండు వేదికలను ప్రకటించగా త్వరలోనే మూడో వేదిక వివరాలను ఇంగ్లాండ్​ తెలియజేయనుందని పేర్కొన్నాడు.

ఇదీ చూడండి.. 'సచిన్​ను ఔటిస్తే నేను హోటల్​కి వెళ్లే వాడ్ని కాదేమో!'

పాకిస్థాన్​తో జులైలో జరగాల్సిన మూడు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్​లను బయో-సెక్యూర్​ వాతావరణంలో నిర్వహించాలని ఇంగ్లీష్​ క్రికెట్​ బోర్డు ప్రతిపాదించింది. ఈ నిర్ణయాన్ని సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్లు పాక్​ క్రికెట్​ బోర్డు కార్యనిర్వాహక అధ్యక్షుడు వసీం ఖాన్ తెలిపాడు.

రెండు దేశాల క్రికెట్​ బోర్డుల మధ్య జరిగిన సంభాషణల ప్రకారం స్టేడియం లోపల హోటళ్లు ఉన్న వాటిని ఎంపిక చేసి తలుపులు మూసేసి మ్యాచ్​లను నిర్వహించాలన్న ఇంగ్లాండ్​ ప్రతిపాదనను పాకిస్థాన్​ అంగీకరించింది.

క్రీడాకారుల ఆరోగ్యభద్రత ముఖ్యం

జులై మొదటి వారంలో 25 మంది ఆటగాళ్లు నాలుగు ప్రత్యేక విమానాల్లో ఇంగ్లాండ్​కు వెళతారని.. నిర్బంధ కాలం తర్వాత సిరీస్​ ప్రారంభించాలని అనుకుంటున్నట్లు పీసీబీ ఛీఫ్​ తెలిపాడు. అయితే ఈ ద్వైపాక్షిక సిరీస్​లో పాల్గొనాలని ఏ ఆటగాడిపై ఒత్తిడి తీసుకురాబోమని.. ఆట కంటే క్రీడాకారుల ఆరోగ్య భద్రత ముఖ్యమని అన్నాడు. ఒకవేళ తుది జట్టులో ఎంపిక చేసిన ఆటగాడు వెళ్లకూడదనుకుంటే వారి నిర్ణయాన్ని మేము గౌరవిస్తామని స్పష్టం చేశాడు. వారిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోమని వ్యాఖ్యానించాడు.

ప్రభుత్వ అనుమతి తీసుకుంటాం

ఈ పర్యటనకు ప్రభుత్వ అనుమతి కచ్చితంగా పొందుతామని పాక్​ క్రికెట్​ బోర్డు ఛీఫ్​ వసీం ఖాన్​ తెలిపాడు. టెస్టు సిరీస్​ కోసం మాంచెస్టర్​, సౌతాంప్టన్​ అనే రెండు వేదికలను ప్రకటించగా త్వరలోనే మూడో వేదిక వివరాలను ఇంగ్లాండ్​ తెలియజేయనుందని పేర్కొన్నాడు.

ఇదీ చూడండి.. 'సచిన్​ను ఔటిస్తే నేను హోటల్​కి వెళ్లే వాడ్ని కాదేమో!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.