పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ ఫవాద్ ఆలమ్ టెస్టుల్లోకి పునరాగమనం చేశాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత తెలుపు జెర్సీలో కనువిందు చేస్తున్నాడు. సౌథాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు ఈ పాక్ సీనియర్ క్రికెటర్. ఇది తన కెరీర్లో నాలుగో టెస్టు మ్యాచ్. ఈ కాలంలో మొత్తం 88 మ్యాచ్లు మిస్సయ్యాడీ 34 ఏళ్ల దాయాది క్రికెటర్.
2019లో ఫస్ట్క్లాస్ టోర్నీ అయిన ఖ్వాయిద్-ఇ-అజామ్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేయడం వల్ల మళ్లీ దశాబ్ద కాలం తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు ఫవాద్.
-
We are making one change as Fawad Alam comes in place of Shadab Khan. #ENGvPAK pic.twitter.com/yttyCB9U8w
— Pakistan Cricket (@TheRealPCB) August 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">We are making one change as Fawad Alam comes in place of Shadab Khan. #ENGvPAK pic.twitter.com/yttyCB9U8w
— Pakistan Cricket (@TheRealPCB) August 13, 2020We are making one change as Fawad Alam comes in place of Shadab Khan. #ENGvPAK pic.twitter.com/yttyCB9U8w
— Pakistan Cricket (@TheRealPCB) August 13, 2020
గతంలో పాకిస్థాన్కు చెందిన యూనిస్ అహ్మద్ 1987లో టెస్టుల్లో అరంగేట్రం చేశాక.. దాదాపు 17 ఏళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. ఇదే ఇప్పటికీ రికార్డుగా ఉంది.
ఆలమ్ చివరిసారి 2009లో డ్యునెడిన్లో న్యూజిలాండ్పై ఆడాడు. శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రదాడి రగడం వల్ల పాక్లో అంతర్జాతీయ క్రికెట్ నిలిచిపోయింది. 2009 జులైలో అతడు శ్రీలంకపై అరంగేట్రం చేసి శతకం బాదాడు. 16 ఏళ్ల తన ఫస్ట్క్లాస్ కెరీర్లో 56.84 సగటుతో 12,222 పరుగులు సాధించాడు.