ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టీ20లో తొడ కండరాలు పట్టేయడం వల్ల విరాట్ కోహ్లీ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత మళ్లీ ఫీల్డింగ్కు రాలేదు. మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడటానికి వచ్చిన సమయంలోనూ కాస్త ఇబ్బందిగా కనిపించాడు. అయితే తనకు అయిన గాయం చిన్నదేనని.. ఐదో టీ20లో ఆడతానని వెల్లడించాడు కోహ్లీ.
"నేను బంతి కోసం పరుగెత్తా. డైవ్ చేసి బంతిని విసిరా. ఆ సమయంలో నా పొజిషన్ సరిగా లేదు. తర్వాత కొంచెం ఇబ్బందిగా అనిపించి మైదానాన్ని వీడా. అది అంత సీరియస్ కాదు. శనివారం ముఖ్యమైన ఐదో టీ20 ఉన్నందున ఎక్కువగా ఒత్తిడికి గురి కావాలని అనుకోలేదు."
-కోహ్లీ, టీమ్ఇండియా సారథి
ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో 15 ఓవర్లో బంతిని ఒడిసిపట్టే క్రమంలో ఇబ్బందిపడ్డాడు కోహ్లీ. ఆ తర్వాత మైదానాన్ని వీడాడు. ఇతడి స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ చేశాడు. ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో గెలిచిన టీమ్ఇండియా శనివారం జరిగే తుదిపోరుకు సిద్ధమైంది.