ETV Bharat / sports

మహిళా టీ20 వరల్డ్​కప్​లో అంపైర్​గా నితిన్​ మేనన్​

author img

By

Published : Feb 13, 2020, 12:09 PM IST

Updated : Mar 1, 2020, 4:55 AM IST

ఈ ఏడాది జరిగే మహిళా టీ20 ప్రపంచకప్​లో ఆరుగుర్ని అంపైర్లుగా నియమించింది ఐసీసీ. ఆ జాబితాలో భారత్​కు చెందిన నితిన్​ మేనన్ ఉన్నాడు. ​

Nitin Menon only Indian, record six women in ICC match-officials' list for women's T20
మహిళల టీ20 వరల్డ్​కప్​లో అంపైర్​గా నితిన్​ మేనన్​

ఆస్ట్రేలియా వేదికగా జరిగే మహిళా టీ20 ప్రపంచకప్​ కోసం ఆరుగురు అంపైర్లను నియమించింది ఐసీసీ. వారిలో భారతీయ అంపైర్​ నితిన్​ మేనన్​కు​ అవకాశం కల్పించింది. మిగిలిన వారిలో లూరెన్​ అజెన్​బాగ్​, కిమ్​ కాటన్​, క్లైరే పొలోసక్​, స్యూ రెడ్​ఫ్రెన్​, జాక్వెలిన్​ విలియమ్స్​ ఉన్నారు. ఇంతకు ముందు చేసిన ప్రకటనలో భారత్​కు చెందిన జీఎస్​ లక్ష్మి ని మహిళా రిఫరీగా ఎంపిక చేశారు.

ఫిబ్రవరి 21న భారత్​-ఆస్ట్రేలియా మధ్య జరగబోయే మ్యాచ్​లో విలియమ్స్​, షౌన్​ జార్జ్​ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. మహిళా అంపైర్​ పర్యవేక్షణలో మ్యాచ్​ జరుగుతుందని బుధవారం ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

పొలోసక్​.. ఫిబ్రవరి 22న వెస్టిండీస్​, థాయ్​లాండ్​ మధ్య జరిగే మ్యాచ్​కు నితిన్​ మేనన్​తో కలిసి పర్యవేక్షించనున్నారు. అయితే మహిళల టీ20 ప్రపంచకప్​కు క్రిస్​ బ్రాడ్​ అనే సీనియర్​తో పాటు, స్టీవ్​ బెర్నార్డ్​ రిఫరీ ప్యానెల్​లో ఉంటారని ఐసీసీ తెలిపింది.

మహిళల టీ20 ప్రపంచకప్​ 2020లో మ్యాచ్​ అఫీషియల్స్​..

మ్యాచ్​ రిఫరీలు:- స్టీవ్​ బెర్నార్డ్​, క్రిస్​ బ్రాడ్​, జీఎస్​ లక్ష్మి

అంపైర్​లు:- లూరెన్​ అజెన్​బాగ్​, బ్రాత్​వైట్​, క్రిస్​ బ్రౌన్​, కిమ్​ కాటన్​, షౌన్​ జార్జ్​, నితిన్​ మేనన్, క్లారీ పొలోసక్​, అసన్​ రాజా, స్యూ రెడ్​ఫ్రెన్​, లాంగ్టన్​ ర్యూసెరీ, జాక్వెలిన్​ విలియమ్స్​.

ఇదీ చూడండి.. యువీ అభిప్రాయంపై భారత మాజీ క్రికెటర్​ కౌంటర్‌

ఆస్ట్రేలియా వేదికగా జరిగే మహిళా టీ20 ప్రపంచకప్​ కోసం ఆరుగురు అంపైర్లను నియమించింది ఐసీసీ. వారిలో భారతీయ అంపైర్​ నితిన్​ మేనన్​కు​ అవకాశం కల్పించింది. మిగిలిన వారిలో లూరెన్​ అజెన్​బాగ్​, కిమ్​ కాటన్​, క్లైరే పొలోసక్​, స్యూ రెడ్​ఫ్రెన్​, జాక్వెలిన్​ విలియమ్స్​ ఉన్నారు. ఇంతకు ముందు చేసిన ప్రకటనలో భారత్​కు చెందిన జీఎస్​ లక్ష్మి ని మహిళా రిఫరీగా ఎంపిక చేశారు.

ఫిబ్రవరి 21న భారత్​-ఆస్ట్రేలియా మధ్య జరగబోయే మ్యాచ్​లో విలియమ్స్​, షౌన్​ జార్జ్​ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. మహిళా అంపైర్​ పర్యవేక్షణలో మ్యాచ్​ జరుగుతుందని బుధవారం ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

పొలోసక్​.. ఫిబ్రవరి 22న వెస్టిండీస్​, థాయ్​లాండ్​ మధ్య జరిగే మ్యాచ్​కు నితిన్​ మేనన్​తో కలిసి పర్యవేక్షించనున్నారు. అయితే మహిళల టీ20 ప్రపంచకప్​కు క్రిస్​ బ్రాడ్​ అనే సీనియర్​తో పాటు, స్టీవ్​ బెర్నార్డ్​ రిఫరీ ప్యానెల్​లో ఉంటారని ఐసీసీ తెలిపింది.

మహిళల టీ20 ప్రపంచకప్​ 2020లో మ్యాచ్​ అఫీషియల్స్​..

మ్యాచ్​ రిఫరీలు:- స్టీవ్​ బెర్నార్డ్​, క్రిస్​ బ్రాడ్​, జీఎస్​ లక్ష్మి

అంపైర్​లు:- లూరెన్​ అజెన్​బాగ్​, బ్రాత్​వైట్​, క్రిస్​ బ్రౌన్​, కిమ్​ కాటన్​, షౌన్​ జార్జ్​, నితిన్​ మేనన్, క్లారీ పొలోసక్​, అసన్​ రాజా, స్యూ రెడ్​ఫ్రెన్​, లాంగ్టన్​ ర్యూసెరీ, జాక్వెలిన్​ విలియమ్స్​.

ఇదీ చూడండి.. యువీ అభిప్రాయంపై భారత మాజీ క్రికెటర్​ కౌంటర్‌

Last Updated : Mar 1, 2020, 4:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.