ETV Bharat / sports

విండీస్ టెస్టు జట్టుకు లారా, శర్వాణ్​ సలహాలు

టెస్టుల్లో సత్తా చాటేందుకు విండీస్ జట్టు సిద్ధమయింది. భారత్​తో జరిగే కీలక టెస్టు సిరీస్​ ముందు ఆటగాళ్లకు సూచనలు, సలహాలు ఇవ్వడానికి మాజీ ఆటగాళ్లు లారా, శర్వాణ్​ ​ జట్టుతో గడపనున్నారు.

author img

By

Published : Aug 17, 2019, 6:00 AM IST

Updated : Sep 27, 2019, 6:16 AM IST

లారా

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్​లను కైవసం చేసుకుంది. ఆగస్టు 22న ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్ కోసం సిద్ధమవుతోంది. అయితే వరుస సిరీస్ ఓటములతో నిరాశలో ఉన్న విండీస్​ జట్టు కోసం ప్రముఖ బ్యాట్స్​మెన్లు లారా, రామ్ ​నరేశ్ శర్వాణ్ రంగంలోకి దిగనున్నారు.

వెస్టిండీస్ లెజెండ్ లారా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశం తరఫున ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. టెస్టుల్లో అత్యధిక స్కోర్ (400*) సాధించిన ఆటగాడిగా ఘనత సాధించాడు. పేరు గాంచిన కరీబియన్ క్రికెటర్లలో శర్వాణ్ ఒకడు. వీరిద్దరూ టెస్టు సిరీస్​ ప్రారంభమవడానికి ముందు ఆటగాళ్లకు వారి విలువైన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు.

"మా జట్టులో ప్రతిభ గల యువ ఆటగాళ్లు ఉన్నారు. భవిష్యత్తుకు వీరే భరోసా. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టు సిరీస్​లో విజయం సాధించాం. యువ ఆటగాళ్లు మరింతగా రాణించాలని అనుకుంటున్నాం. ​అందుకోసం లారా, శర్వాణ్​ను సంప్రదించాం. వారి సలహాలు, సూచనలు ఆటగాళ్లకు మరింత లాభం చేకూరుస్తాయి".

-జిమ్మీ ఆడమ్స్, క్రికెట్ విండీస్ డైరెక్టర్

వెస్టిండీస్​-భారత్ మధ్య మొదటి టెస్టు ఆగస్టు 22న ప్రారంభంకానుంది. ఆంటిగ్వా వేదికగా జరగనున్న ఈ మ్యాచ్​తో టెస్టు ఛాంపియన్​ షిప్​ను ప్రారంభించనున్నాయి ఇరుజట్లు.

ఇవీ చూడండి.. శతకాల వేటలో రోహిత్-కోహ్లీ ద్వయం

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్​లను కైవసం చేసుకుంది. ఆగస్టు 22న ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్ కోసం సిద్ధమవుతోంది. అయితే వరుస సిరీస్ ఓటములతో నిరాశలో ఉన్న విండీస్​ జట్టు కోసం ప్రముఖ బ్యాట్స్​మెన్లు లారా, రామ్ ​నరేశ్ శర్వాణ్ రంగంలోకి దిగనున్నారు.

వెస్టిండీస్ లెజెండ్ లారా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశం తరఫున ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. టెస్టుల్లో అత్యధిక స్కోర్ (400*) సాధించిన ఆటగాడిగా ఘనత సాధించాడు. పేరు గాంచిన కరీబియన్ క్రికెటర్లలో శర్వాణ్ ఒకడు. వీరిద్దరూ టెస్టు సిరీస్​ ప్రారంభమవడానికి ముందు ఆటగాళ్లకు వారి విలువైన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు.

"మా జట్టులో ప్రతిభ గల యువ ఆటగాళ్లు ఉన్నారు. భవిష్యత్తుకు వీరే భరోసా. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టు సిరీస్​లో విజయం సాధించాం. యువ ఆటగాళ్లు మరింతగా రాణించాలని అనుకుంటున్నాం. ​అందుకోసం లారా, శర్వాణ్​ను సంప్రదించాం. వారి సలహాలు, సూచనలు ఆటగాళ్లకు మరింత లాభం చేకూరుస్తాయి".

-జిమ్మీ ఆడమ్స్, క్రికెట్ విండీస్ డైరెక్టర్

వెస్టిండీస్​-భారత్ మధ్య మొదటి టెస్టు ఆగస్టు 22న ప్రారంభంకానుంది. ఆంటిగ్వా వేదికగా జరగనున్న ఈ మ్యాచ్​తో టెస్టు ఛాంపియన్​ షిప్​ను ప్రారంభించనున్నాయి ఇరుజట్లు.

ఇవీ చూడండి.. శతకాల వేటలో రోహిత్-కోహ్లీ ద్వయం

Intro:Body:Conclusion:
Last Updated : Sep 27, 2019, 6:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.