ETV Bharat / sports

ఆసీస్​ యువ బౌలర్ మెరిడిత్​కు రికార్డు ధర - ipl

ఐపీఎల్​ వేలంలో ఆసీస్ యువ ఆల్​రౌండర్​ రిలే మెరిడిత్ అత్యధిక ధరకు అమ్ముడయ్యాడు. పంజాబ్​ ఫ్రాంచైజీ ఇతన్ని రూ.8 కోట్లకు సొంతం చేసుకుంది.

IPL-auction-riley-meredith
రూ.8 కోట్లతో మెరిసిన మెరిడిట్.. పంజాబ్​ సొంతం
author img

By

Published : Feb 18, 2021, 6:19 PM IST

చెన్నై వేదికగా జరుగుతోన్న ఐపీఎల్​ వేలంలో ఆసీస్​ యువ ఆల్​రౌండర్​​ రిలే మెరిడిత్ రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాడు. పంజాబ్​ జట్టు ఇతడిని రూ.8 కోట్లకు సొంతం చేసుకుంది. ​రూ.40 లక్షల కనీస విలువ జాబితాలో ఉన్న ఈ ఆటగాడు అనూహ్యంగా అధిక ధర పలికాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ అన్​క్యాప్​డ్ విదేశీ క్రికెటర్​కు ఇంత ధర పలకడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు జోఫ్రా ఆర్చర్ (7.2 కోట్లు) పేరిట ఈ రికార్డు ఉండేది.

భారత యువ బౌలర్​ చేతన్​ సకరియాను రాజస్థాన్​ రాయల్స్​ కొనుగోలు చేసింది. రూ.20 లక్షల బేస్​ ప్రైస్​తో ఉన్న ఈ ఆటగాడు రూ.1.20 కోట్లకు అమ్ముడయ్యాడు.
కాగా, సన్​రైజర్స్​ ఫ్రాంచైజీ జగదీష్​ సుచిత్​ను రూ.20 లక్షల కనీస ధరకు దక్కించుకుంది.

చెన్నై వేదికగా జరుగుతోన్న ఐపీఎల్​ వేలంలో ఆసీస్​ యువ ఆల్​రౌండర్​​ రిలే మెరిడిత్ రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాడు. పంజాబ్​ జట్టు ఇతడిని రూ.8 కోట్లకు సొంతం చేసుకుంది. ​రూ.40 లక్షల కనీస విలువ జాబితాలో ఉన్న ఈ ఆటగాడు అనూహ్యంగా అధిక ధర పలికాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ అన్​క్యాప్​డ్ విదేశీ క్రికెటర్​కు ఇంత ధర పలకడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు జోఫ్రా ఆర్చర్ (7.2 కోట్లు) పేరిట ఈ రికార్డు ఉండేది.

భారత యువ బౌలర్​ చేతన్​ సకరియాను రాజస్థాన్​ రాయల్స్​ కొనుగోలు చేసింది. రూ.20 లక్షల బేస్​ ప్రైస్​తో ఉన్న ఈ ఆటగాడు రూ.1.20 కోట్లకు అమ్ముడయ్యాడు.
కాగా, సన్​రైజర్స్​ ఫ్రాంచైజీ జగదీష్​ సుచిత్​ను రూ.20 లక్షల కనీస ధరకు దక్కించుకుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.