ఐపీఎల్లో కొవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా వాంఖడే స్టేడియంలోని లీగ్తో సంబంధమున్న మరో ముగ్గురికి కరోనా నిర్ధరణ అయింది. అందులో ఇద్దరు గ్రౌండ్ సిబ్బంది కాగా మరొక్కరు ప్లంబర్. ఇటీవల ఇదే మైదానపు సిబ్బంది 10 మందికి పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని ముంబయి క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) ధ్రువీకరించింది.
ఇదీ చదవండి: 'ముంబయిలో ఐపీఎల్ మ్యాచ్లకు అనుమతిచ్చాం'
ముంబయి వేదికగా జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్లు ముగిసే వరకు.. మిగతా గ్రౌండ్ సిబ్బందిని వాంఖడే మైదానంలోని క్లబ్హౌస్లో ఉంచుతామని ఎంసీఏ తెలిపింది.
ముంబయిలో కేసులు పెరుగుతున్నా వేదికను మార్చాల్సిన అవసరం లేదని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ కూడా ఈ విషయంపై స్పందించారు. లీగ్ నిర్వహణకు ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు.
ఇదీ చదవండి: 'షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ నిర్వహణ'