ETV Bharat / sports

భారత బ్యాట్స్​మెన్​ విఫలం​... సఫారీల లక్ష్యం 135

author img

By

Published : Sep 22, 2019, 8:50 PM IST

Updated : Oct 1, 2019, 3:20 PM IST

చిన్నస్వామి స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ20లో భారత బ్యాట్స్​మెన్​ తేలిపోయారు. సఫారీల బౌలింగ్​ ఎదుర్కోలేక తక్కువ పరుగులకే ఔటైంది కోహ్లీసేన. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 స్కోరు మాత్రమే సాధించింది.

భారత బ్యాట్స్​మెన్​ విఫలం​... సఫారీ జట్టు లక్ష్యం 140

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 పోరులో భారత్‌ బ్యాట్స్​మెన్​ నిరాశపర్చారు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు చిన్నస్వామి వేదికగా జరిగిన ఆఖరి టీ20లో... నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది టీమిండియా.

ఆరంభమే నిరాశ...

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న కోహ్లీసేనకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్​ రోహిత్​శర్మ(9) సిరీస్​లో మరోసారి పేలవ ప్రదర్శన చేశాడు. మరో ఓపెనర్​ శిఖర్​ ధావన్​ 36 పరుగులతో(25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి రాణించాడు. హిట్​మ్యాన్​ ఔట్​ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్​ కోహ్లీ 9 పరుగులకే ఔటయ్యాడు.

ఈ టోర్నీలో ప్రదర్శన కారణంగా నిరాశ ఎదుర్కొంటున్న రిషబ్​ పంత్​ 19 పరుగులు(20 బంతుల్లో 1ఫోర్​, 1 సిక్సర్​) మెరుగయ్యాడు. మిగతా బ్యాట్స్​మెన్​ శ్రేయస్​ అయ్యర్​(5), కృనాల్​ పాండ్య(5) దారుణంగా విఫలమయ్యారు.

ఆల్​రౌండర్లు హార్దిక్​ పాండ్య 14 పరుగులు(18 బంతుల్లో 1 ఫోర్​), రవీంద్ర జడేజా 19 రన్స్​(17 బంతుల్లో 1 ఫోర్​, 1సిక్సర్) ఫర్వాలేదనిపించారు. వీరిద్దరి వల్లే స్కోరు ఆ మాత్రమైనా వచ్చింది. ఆఖర్లో టపటపా వికెట్లు కోల్పోయింది టీమిండియా. వాషింగ్టన్​ సుందర్​(4) తక్కువకే ఆటయ్యాడు. బౌలర్లు దీపక్​ చాహర్​(0), సైనీ(0) క్రీజులో నిలిచి ఆలౌట్​ కాకుండా చూసుకున్నారు.

సఫారీ జట్టు బౌలర్లలో రబాడా 3 వికెట్లు, ఫార్చ్యూన్​, హెండ్రిక్స్​ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. షంశీ ఒక వికెట్​ ఖాతాలో వేసుకున్నాడు.

మూడు మ్యాచ్​ల సిరీస్​లో 1-0తో ఆధిక్యంలో ఉంది టీమిండియా. తొలి టీ20 వర్షం కారణంగా రద్దవ్వగా... రెండో మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 పోరులో భారత్‌ బ్యాట్స్​మెన్​ నిరాశపర్చారు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు చిన్నస్వామి వేదికగా జరిగిన ఆఖరి టీ20లో... నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది టీమిండియా.

ఆరంభమే నిరాశ...

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న కోహ్లీసేనకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్​ రోహిత్​శర్మ(9) సిరీస్​లో మరోసారి పేలవ ప్రదర్శన చేశాడు. మరో ఓపెనర్​ శిఖర్​ ధావన్​ 36 పరుగులతో(25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి రాణించాడు. హిట్​మ్యాన్​ ఔట్​ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్​ కోహ్లీ 9 పరుగులకే ఔటయ్యాడు.

ఈ టోర్నీలో ప్రదర్శన కారణంగా నిరాశ ఎదుర్కొంటున్న రిషబ్​ పంత్​ 19 పరుగులు(20 బంతుల్లో 1ఫోర్​, 1 సిక్సర్​) మెరుగయ్యాడు. మిగతా బ్యాట్స్​మెన్​ శ్రేయస్​ అయ్యర్​(5), కృనాల్​ పాండ్య(5) దారుణంగా విఫలమయ్యారు.

ఆల్​రౌండర్లు హార్దిక్​ పాండ్య 14 పరుగులు(18 బంతుల్లో 1 ఫోర్​), రవీంద్ర జడేజా 19 రన్స్​(17 బంతుల్లో 1 ఫోర్​, 1సిక్సర్) ఫర్వాలేదనిపించారు. వీరిద్దరి వల్లే స్కోరు ఆ మాత్రమైనా వచ్చింది. ఆఖర్లో టపటపా వికెట్లు కోల్పోయింది టీమిండియా. వాషింగ్టన్​ సుందర్​(4) తక్కువకే ఆటయ్యాడు. బౌలర్లు దీపక్​ చాహర్​(0), సైనీ(0) క్రీజులో నిలిచి ఆలౌట్​ కాకుండా చూసుకున్నారు.

సఫారీ జట్టు బౌలర్లలో రబాడా 3 వికెట్లు, ఫార్చ్యూన్​, హెండ్రిక్స్​ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. షంశీ ఒక వికెట్​ ఖాతాలో వేసుకున్నాడు.

మూడు మ్యాచ్​ల సిరీస్​లో 1-0తో ఆధిక్యంలో ఉంది టీమిండియా. తొలి టీ20 వర్షం కారణంగా రద్దవ్వగా... రెండో మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Yokohama International Stadium, Yokohama, Japan. 22nd September 2019.
++SHOTLIST TO FOLLOW++
SOURCE: SNTV
DURATION: 04:06
STORLINE:
Jacob Stockdale, Jordan Larmour and Stuart Hogg were amongst the players giving their reactions after Ireland beat Scotland 27-3 in the two Home Nations' opening game of the Rugby World Cup in Yokohama, Japan on Sunday.
Last Updated : Oct 1, 2019, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.