ETV Bharat / sports

ఇంగ్లాండ్​ను చుట్టేసిన అశ్విన్​, అక్షర్​- సిరీస్​ భారత్​ సొంతం - భారత్​Xఇంగ్లాండ్ ఫైనల్ టెస్ట్

చివరి టెస్టులో ఇంగ్లాండ్​పై భారత్​ ఘన విజయం సాధించింది. 3-1తో సిరీస్​ను కైవసం చేసుకుంది కోహ్లీ సేన. టీమ్​ఇండియా బౌలర్లలో అశ్విన్, అక్షర్ రెండో ఇన్నింగ్స్​లో చెరో 5 వికెట్లు తీశారు. ఈ విజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్లోకి చేరుకుంది భారత్. లార్డ్స్​లో కివీస్​తో అమీతుమీ తేల్చుకోనుంది.

India seals the series against england enters WTC
ఇంగ్లాండ్​పై ఘన విజయం.. డబ్ల్యూటీసీ ఫైనల్లోకి కోహ్లీసేన
author img

By

Published : Mar 6, 2021, 4:03 PM IST

Updated : Mar 6, 2021, 4:44 PM IST

అహ్మదాబాద్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన చివరి టెస్టులో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్​ 25 పరుగుల తేడాతో భారత్​ జయభేరి మోగించింది. నాలుగు మ్యాచ్​ల సిరీస్​ను 3-1తో కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్​లో భారత బౌలర్లు.. అశ్విన్​, అక్షర్ చెరో 5 వికెట్లు తీసుకున్నారు.

మొత్తంగా ఈ టెస్టులో అక్షర్​ 9, అశ్విన్​ 8 వికెట్లు పడగొట్టారు.

160 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్​ ప్రారంభించిన ఇంగ్లాండ్​ బ్యాటింగ్ ఆర్డర్​ పేకమేడను తలపించింది. భారత స్పిన్నర్ల ధాటికి ఏ ఒక్కరూ క్రీజులో నిలువలేకపోయారు. అర్ధ సెంచరీ చేసిన లారెన్స్​ ఆ జట్టు టాప్​ స్కోరర్​గా నిలిచాడు.

ఈ విజయంతో భారత్​ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్​ ఫైనల్లోకి ప్రవేశించింది. 72.2 విజయశాతంతో టీమ్​ఇండియా అగ్రస్థానంలోకి వెళ్లింది. లార్డ్స్​ వేదికగా న్యూజిలాండ్​తో ఫైనల్​ మ్యాచ్​ ఆడనుంది.

సంక్షిప్త స్కోర్లు:

ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​- 205 ఆలౌట్​( స్టోక్స్​ 55, లారెన్స్​ 46, అక్షర్​ పటేల్​ 4/68, అశ్విన్​ 3/47)

భారత్​ తొలి ఇన్నింగ్స్​- 365 ఆలౌట్​( పంత్​ 101, వాషింగ్టన్​ సుందర్​ 96*, స్టోక్స్​ 4/89, అండర్సన్​ 3/44)

ఇంగ్లాండ్​ రెండో ఇన్నింగ్స్​- 135 ఆలౌట్​( లారెన్స్​ 50, రూట్​ 30, అశ్విన్​ 5/47, అక్షర్​ 5/48)

ఇదీ చదవండి:లంచ్​ సమయానికి ఇంగ్లాండ్​ 6/0- 154 పరుగుల వెనుకంజ

అహ్మదాబాద్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన చివరి టెస్టులో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్​ 25 పరుగుల తేడాతో భారత్​ జయభేరి మోగించింది. నాలుగు మ్యాచ్​ల సిరీస్​ను 3-1తో కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్​లో భారత బౌలర్లు.. అశ్విన్​, అక్షర్ చెరో 5 వికెట్లు తీసుకున్నారు.

మొత్తంగా ఈ టెస్టులో అక్షర్​ 9, అశ్విన్​ 8 వికెట్లు పడగొట్టారు.

160 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్​ ప్రారంభించిన ఇంగ్లాండ్​ బ్యాటింగ్ ఆర్డర్​ పేకమేడను తలపించింది. భారత స్పిన్నర్ల ధాటికి ఏ ఒక్కరూ క్రీజులో నిలువలేకపోయారు. అర్ధ సెంచరీ చేసిన లారెన్స్​ ఆ జట్టు టాప్​ స్కోరర్​గా నిలిచాడు.

ఈ విజయంతో భారత్​ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్​ ఫైనల్లోకి ప్రవేశించింది. 72.2 విజయశాతంతో టీమ్​ఇండియా అగ్రస్థానంలోకి వెళ్లింది. లార్డ్స్​ వేదికగా న్యూజిలాండ్​తో ఫైనల్​ మ్యాచ్​ ఆడనుంది.

సంక్షిప్త స్కోర్లు:

ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​- 205 ఆలౌట్​( స్టోక్స్​ 55, లారెన్స్​ 46, అక్షర్​ పటేల్​ 4/68, అశ్విన్​ 3/47)

భారత్​ తొలి ఇన్నింగ్స్​- 365 ఆలౌట్​( పంత్​ 101, వాషింగ్టన్​ సుందర్​ 96*, స్టోక్స్​ 4/89, అండర్సన్​ 3/44)

ఇంగ్లాండ్​ రెండో ఇన్నింగ్స్​- 135 ఆలౌట్​( లారెన్స్​ 50, రూట్​ 30, అశ్విన్​ 5/47, అక్షర్​ 5/48)

ఇదీ చదవండి:లంచ్​ సమయానికి ఇంగ్లాండ్​ 6/0- 154 పరుగుల వెనుకంజ

Last Updated : Mar 6, 2021, 4:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.