ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో పాయింట్లు పెంచుకునే దిశగా ముందుకు సాగుతోంది టీమిండియా. ఇప్పటికే వెస్టిండీస్తో జరిగిన టెస్టు సిరీస్ను కైవసం చేసుకున్న కోహ్లీసేన అదే జోరును దక్షిణాఫ్రికా సిరీస్లోనూ చూపించాలనుకుంటుంది.
కరీబియన్లపై 2-0 తేడాతో నెగ్గి 120 పాయింట్లు ఖాతాలో వేసుకుంది టీమిండియా. ఇలాంటివి మరో మూడు సిరీస్లు ఆడనున్న ఏకైక జట్టు కోహ్లీసేనే. రెండు మ్యాచ్ల సిరీస్ను డ్రా చేసుకున్న శ్రీలంక - న్యూజిలాండ్ చెరో 60 పాయింట్లు దక్కించుకున్నాయి. 5 మ్యాచ్ల యాషెస్ సిరీస్ను డ్రా చేసుకున్న ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా చెరో 56 పాయింట్లు పొందాయి.
విశాఖపట్టణం వేదికగా అక్టోబర్ 2న భారత్ - దక్షిణాఫ్రికా మధ్య మొదటి టెస్టు జరగనుంది. రెండోది పుణెలో, మూడో టెస్టు రాంచీ వేదికగా నిర్వహించనున్నారు. ఈ మూడు టెస్టుల సిరీస్లో మ్యాచ్కు 40 పాయింట్లు చొప్పున గెలిచిన జట్టు ఖాతాలో చేరతాయి. ఈ రకంగా 120 పాయింట్లు వస్తాయి.
ప్రొటీస్ జట్టుపై సిరీస్ నెగ్గి తన పాయింట్లను 240కు పెంచుకుందామని చూస్తోంది కోహ్లీసేన. ఓడితే 120 పాయింట్లతో ఇరు జట్లు టాప్-2లో ఉంటాయి. ఈ విధంగా ప్రతి మ్యాచ్లో గెలుస్తూ పాయింట్లతో ముందు వరుసలో ఉన్న రెండు జట్ల మధ్య 2021 జూన్లో టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఇదీ చదవండి: హరియాణా ఎన్నికల దంగల్ పోటీలో క్రీడాకారులు