స్లో ఓవర్ రేట్ కారణంగా టీమ్ఇండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత పడింది. ఇంగ్లాండ్తో శనివారం జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో నిర్ణీత సమయానికి రెండు ఓవర్లు తక్కువగా వేసింది కోహ్లీ సేన.
దీంతో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు ఐసీసీ ఎలైట్ ప్యానల్ మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్. జరిగిన తప్పిదాన్ని టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంగీకరించాడు.
నిర్ణయాత్మక చివరి టీ20లో గెలిచిన టీమ్ఇండియా.. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది.
ఇదీ చదవండి: 'ఐపీఎల్ సమయంలో అంతర్జాతీయ మ్యాచ్లు ఎందుకు?'