ఆస్ట్రేలియాతో తొలి టెస్టు కోసం పంత్, సాహాలలో ఎవరిని తీసుకోవాలనేది మేనేజ్మెంట్కు కష్టమైన విషయమని భారత బ్యాట్స్మన్ హనుమ విహారి అన్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ మంచి ఫామ్లో ఉండటమే ఇందుకు కారణమని చెప్పాడు.
"జట్టులోని ప్రతి స్థానం కోసం ఆరోగ్యకర పోటీ ఉండటం ఎప్పుడూ మంచిదే. అయితే ఎవరిని తీసుకోవాలనేది మేనేజ్మెంట్ నిర్ణయం. నాకు తెలిసినంతవరకు ఇద్దరూ(పంత్, సాహా) మంచి ఫామ్లో ఉన్నారు. వారిలో ఒకరిని ఎంపిక చేయడం సవాలే" -హనుమ విహారి, భారత బ్యాట్స్మన్
టీమ్ఇండియా-ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య జరిగిన రెండో వార్మప్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇందులో పంత్ సెంచరీతో(103 నాటౌట్) అదరగొట్టాడు. దీంతో సాహా బదులుగా అతడిని జట్టులోకి తీసుకోవాలని పలువురు మాజీలు అంటున్నారు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య ఈనెల 17న అడిలైడ్ తొలి టెస్టు డే/నైట్ పద్ధతిలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు సిద్ధమతున్నాయి.