ETV Bharat / sports

నటరాజన్​ ఎంపిక.. సెహ్వాగ్​కు ప్రశ్నలు - T Natarajan latest news

పంజాబ్​ జట్టుకు మెంటార్​గా ఉన్నప్పుడు నటరాజన్​ను ఎంపిక చేస్తానంటే, అందరూ తనను ప్రశ్నించారని సెహ్వాగ్ అన్నాడు. ఓ టీవీ షోలో మాట్లాడుతూ ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇంతకీ అప్పుడు ఏం జరిగింది?

Everyone questioned when I picked T Natarajan for Kings XI Punjab: Virender Sehwag
యార్కర్ స్పెషలిస్టు నటరాజన్
author img

By

Published : Dec 3, 2020, 6:46 PM IST

ఇటీవల ఐపీఎల్​లో ఆకట్టుకున్న యార్కర్​ స్పెషలిస్టు నటరాజన్​.. భారత్​ తరఫున అరంగేట్ర వన్డేలోనే సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన ఈ మ్యాచ్​లో రెండు వికెట్లు తీసి మెప్పించాడు. ఈ సందర్భంగా పలువురు మాజీలు అతడిని ప్రశంసిస్తున్నారు. అయితే 2017 ఐపీఎల్​ వేలంలో పంజాబ్ కోసం అతడిని ఎంపిక చేస్తానంటే, తనను అందరూ ప్రశ్నించారంటూ మాజీ క్రికెటర్ సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు.

2017లో ఐపీఎల్​ అరంగేట్రం చేసిన నటరాజన్.. ఈ సీజన్​లో హైదరాబాద్​ తరఫున అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తద్వారా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించాడు.

kohli natarajan
నటరాజన్​ను అభినందిస్తున్న కోహ్లీ

"2017 ఐపీఎల్​ వేలంలో పంజాబ్​ కోసం నటరాజన్​ ఎంపిక చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అంతకుముందు అతడి బౌలింగ్​ వీడియోలు చూసిన తర్వాత, మా జట్టులో డెత్​ బౌలర్​ కావాలని నటరాజన్​ను తీసుకున్నాం. తమిళనాడు ప్రీమియర్ లీగ్​ మాత్రమే ఆడిన అతడిని ఎలా కొనుగోలు చేస్తారని అప్పుడు అందరూ నన్ను ప్రశ్నించారు. దురదృష్టవశాత్తూ ఆ ఏడాది నటరాజన్​కు గాయమవడం వల్ల ఎక్కువ మ్యాచ్​లు ఆడలేకపోయాడు. విచిత్రమేమిటంటే అతడు ఆడిన మ్యాచ్​లు మాత్రమే ఆ సీజన్​లో పంజాబ్​ గెలిచింది"

"నటరాజన్​ భారత్ జట్టులో చోటు దక్కిందనే విషయం తెలియగానే చాలా సంతోషంగా అనిపించింది. అయితే టీ20లతో అరంగేట్రం చేస్తాడనుకున్న తాను.. వన్డేలు తొలుత ఆడటం కాస్త ఆశ్చర్యం కలిగించింది​" అని సెహ్వాగ్ చెప్పాడు.

కాన్​బెర్రాలో బుధవారం జరిగిన మూడో వన్డేలో 13 పరుగుల తేడాతో టీమ్​ఇండియా విజయం సాధించింది. గత రెండు మ్యాచ్​ల్లో ఆస్ట్రేలియా గెలవడం వల్ల 1-2 తేడాతో సిరీస్​ను కోల్పోయింది. శుక్రవారం(డిసెంబరు 4) నుంచి ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

Everyone questioned when I picked T Natarajan for Kings XI Punjab: Virender Sehwag
వికెట్ తీసిన ఆనందంలో నటరాజన్

ఇవీ చదవండి:

ఇటీవల ఐపీఎల్​లో ఆకట్టుకున్న యార్కర్​ స్పెషలిస్టు నటరాజన్​.. భారత్​ తరఫున అరంగేట్ర వన్డేలోనే సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన ఈ మ్యాచ్​లో రెండు వికెట్లు తీసి మెప్పించాడు. ఈ సందర్భంగా పలువురు మాజీలు అతడిని ప్రశంసిస్తున్నారు. అయితే 2017 ఐపీఎల్​ వేలంలో పంజాబ్ కోసం అతడిని ఎంపిక చేస్తానంటే, తనను అందరూ ప్రశ్నించారంటూ మాజీ క్రికెటర్ సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు.

2017లో ఐపీఎల్​ అరంగేట్రం చేసిన నటరాజన్.. ఈ సీజన్​లో హైదరాబాద్​ తరఫున అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తద్వారా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించాడు.

kohli natarajan
నటరాజన్​ను అభినందిస్తున్న కోహ్లీ

"2017 ఐపీఎల్​ వేలంలో పంజాబ్​ కోసం నటరాజన్​ ఎంపిక చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అంతకుముందు అతడి బౌలింగ్​ వీడియోలు చూసిన తర్వాత, మా జట్టులో డెత్​ బౌలర్​ కావాలని నటరాజన్​ను తీసుకున్నాం. తమిళనాడు ప్రీమియర్ లీగ్​ మాత్రమే ఆడిన అతడిని ఎలా కొనుగోలు చేస్తారని అప్పుడు అందరూ నన్ను ప్రశ్నించారు. దురదృష్టవశాత్తూ ఆ ఏడాది నటరాజన్​కు గాయమవడం వల్ల ఎక్కువ మ్యాచ్​లు ఆడలేకపోయాడు. విచిత్రమేమిటంటే అతడు ఆడిన మ్యాచ్​లు మాత్రమే ఆ సీజన్​లో పంజాబ్​ గెలిచింది"

"నటరాజన్​ భారత్ జట్టులో చోటు దక్కిందనే విషయం తెలియగానే చాలా సంతోషంగా అనిపించింది. అయితే టీ20లతో అరంగేట్రం చేస్తాడనుకున్న తాను.. వన్డేలు తొలుత ఆడటం కాస్త ఆశ్చర్యం కలిగించింది​" అని సెహ్వాగ్ చెప్పాడు.

కాన్​బెర్రాలో బుధవారం జరిగిన మూడో వన్డేలో 13 పరుగుల తేడాతో టీమ్​ఇండియా విజయం సాధించింది. గత రెండు మ్యాచ్​ల్లో ఆస్ట్రేలియా గెలవడం వల్ల 1-2 తేడాతో సిరీస్​ను కోల్పోయింది. శుక్రవారం(డిసెంబరు 4) నుంచి ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

Everyone questioned when I picked T Natarajan for Kings XI Punjab: Virender Sehwag
వికెట్ తీసిన ఆనందంలో నటరాజన్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.