స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడింది. టీమ్ఇండియాతో గురువారం జరిగిన నాలుగో టీ20లో నిర్ణీత సమయంలో ఒక్క ఓవర్ తక్కువగా వేసింది మోర్గాన్ సేన.
దీంతో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు ఐసీసీ ఎలైట్ ప్యానల్ మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్. జరిగిన తప్పిదాన్ని ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ అంగీకరించాడు.
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇరు జట్లు చెరో రెండు విజయాలు నమోదు చేశాయి. ఆఖరి, నిర్ణయాత్మక మ్యాచ్ శనివారం జరగనుంది.
ఇదీ చదవండి: 'టీమ్ఇండియా బెంచ్ బలానికి ఐపీఎల్యే కారణం'