ETV Bharat / sports

చెన్నై టెస్ట్​లో తిప్పేసిన భారత్​- ఇంగ్లండ్​ 134 ఆలౌట్​

author img

By

Published : Feb 14, 2021, 3:07 PM IST

Updated : Feb 14, 2021, 3:36 PM IST

ఇంగ్లండ్​తో జరుగుతోన్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్​లో భారత బౌలర్లు భలా అనిపించారు. గింగిరాలు తిరిగే బంతులతో చెలరేగిన ఆతిథ్య జట్టు.. ఇంగ్లండ్​ను 134 పరుగులకు చుట్టేసింది.

ENG VS IND 2ND TEST
చెన్నై టెస్ట్​లో తిప్పేసిన భారత్​- ఇంగ్లండ్​ 134 ఆలౌట్​

చెపాక్​ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ 134 పరుగులకు ఆలౌటైంది. స్పిన్​కు సహకరిస్తున్న పిచ్​పై భారత బౌలర్లు పండుగ చేసుకున్నారు. టీ​ సమయానికి 106/8తో ఉన్న ఇంగ్లిష్​ జట్టు.. విరామం అనంతరం ఆచితూచి ఆడింది. నిలకడగా ఆడిన వికెట్​ కీపర్​ బ్యాట్స్​మెన్​ బెన్​ ఫోక్స్​ 42* పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో తక్కువ స్కోరుకే పరిమితమవ్వాల్సిన ఆ జట్టు.. మూడో సెషన్​లో మరో 28 పరుగులు జోడించి కుప్పుకూలింది.

Team India
ప్రత్యర్థి టీమ్​ను ఆలౌట్​ చేసిన ఆనందంలో టీమ్​ఇండియా

భారత్​ బౌలర్లలో స్పిన్నర్ రవిచంద్రన్​ అశ్విన్​ మరోసారి 5వికెట్లతో మెరిశాడు. అక్షర్​ పటేల్​-2 వికెట్లు నేలకూల్చగా.. పేసర్లలో ఇషాంత్ శర్మ-2, మహ్మద్​ సిరాజ్​ ఒక వికెట్​ దక్కించుకున్నారు.

Ashwin
అశ్విన్​ను అభినందిస్తున్న సహచరులు

ఫాల్​ఆన్​ ఆడించకుండానే..

ఈ మ్యాచ్​లో ఇంగ్లండ్​ను 134కు చుట్టేసి.. 195 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది భారత్​. ఈ క్రమంలో ఫాలోఆన్​లో పడిన ప్రత్యర్థి జట్టును మరోసారి బ్యాటింగ్​కు ఆహ్వానించకుండా.. భారత బ్యాట్స్​మెన్​ క్రీజులోకి అడుగుపెట్టారు. రెండో ఇన్నింగ్స్​లో వీలైనన్ని పరుగులు చేసి.. పర్యటక జట్టు ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనుకుంటోంది కోహ్లీసేన.

అంతకుముందు.. 300/6 స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన టీమ్​ ఇండియా.. మరో 29 పరుగులు జోడించి ఆలౌట్​ అయింది. వికెట్​ కీపర్​ రిషభ్​ పంత్​-58*(77 బంతుల్లో 7ఫోర్లు, 3సిక్సర్లు) మరోసారి అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు.

ఇవీ చదవండి:

రెండో టెస్టులో గెలుపుపై డీకే జోస్యం

'రెండో టెస్టు మూడు రోజుల్లోనే ముగుస్తుంది!'

చెపాక్​ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ 134 పరుగులకు ఆలౌటైంది. స్పిన్​కు సహకరిస్తున్న పిచ్​పై భారత బౌలర్లు పండుగ చేసుకున్నారు. టీ​ సమయానికి 106/8తో ఉన్న ఇంగ్లిష్​ జట్టు.. విరామం అనంతరం ఆచితూచి ఆడింది. నిలకడగా ఆడిన వికెట్​ కీపర్​ బ్యాట్స్​మెన్​ బెన్​ ఫోక్స్​ 42* పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో తక్కువ స్కోరుకే పరిమితమవ్వాల్సిన ఆ జట్టు.. మూడో సెషన్​లో మరో 28 పరుగులు జోడించి కుప్పుకూలింది.

Team India
ప్రత్యర్థి టీమ్​ను ఆలౌట్​ చేసిన ఆనందంలో టీమ్​ఇండియా

భారత్​ బౌలర్లలో స్పిన్నర్ రవిచంద్రన్​ అశ్విన్​ మరోసారి 5వికెట్లతో మెరిశాడు. అక్షర్​ పటేల్​-2 వికెట్లు నేలకూల్చగా.. పేసర్లలో ఇషాంత్ శర్మ-2, మహ్మద్​ సిరాజ్​ ఒక వికెట్​ దక్కించుకున్నారు.

Ashwin
అశ్విన్​ను అభినందిస్తున్న సహచరులు

ఫాల్​ఆన్​ ఆడించకుండానే..

ఈ మ్యాచ్​లో ఇంగ్లండ్​ను 134కు చుట్టేసి.. 195 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది భారత్​. ఈ క్రమంలో ఫాలోఆన్​లో పడిన ప్రత్యర్థి జట్టును మరోసారి బ్యాటింగ్​కు ఆహ్వానించకుండా.. భారత బ్యాట్స్​మెన్​ క్రీజులోకి అడుగుపెట్టారు. రెండో ఇన్నింగ్స్​లో వీలైనన్ని పరుగులు చేసి.. పర్యటక జట్టు ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనుకుంటోంది కోహ్లీసేన.

అంతకుముందు.. 300/6 స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన టీమ్​ ఇండియా.. మరో 29 పరుగులు జోడించి ఆలౌట్​ అయింది. వికెట్​ కీపర్​ రిషభ్​ పంత్​-58*(77 బంతుల్లో 7ఫోర్లు, 3సిక్సర్లు) మరోసారి అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు.

ఇవీ చదవండి:

రెండో టెస్టులో గెలుపుపై డీకే జోస్యం

'రెండో టెస్టు మూడు రోజుల్లోనే ముగుస్తుంది!'

Last Updated : Feb 14, 2021, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.