బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా తొలి డే/నైట్ టెస్టు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈడెన్ గార్డెన్స్లో వచ్చే నెల 22-26 వరకు జరిగే ఈ మ్యాచ్లో భారత్-బంగ్లాదేశ్ తలపడనున్నాయి. దీనికి సంబంధించిన టిక్ట్ ధరలు, సమయం వివరాలను బంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) కార్యదర్శి అవిషేక్ దాల్మియా ప్రకటించారు. టికెట్ కనీస ధర రూ.50గా ఉంటుందని చెప్పారు.
"మ్యాచ్ మధ్యాహ్నం 1:30కి మొదలై రాత్రి 8:30కి ముగుస్తుంది. వీక్షకులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటికి చేరుకోవచ్చు. బీసీసీఐ నుంచి ధ్రువీకరణ వస్తే టికెట్లు ముద్రణకు పంపిస్తాం. అదే విధంగా పాఠశాల విద్యార్థులను ఈ టెస్టుకు వచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. టికెట్ ధరలు రూ.50, 100, 150లుగా ఉంటాయి. వీలైనంత మందిని మ్యాచ్ చూసేలా చేయడమే మా లక్ష్యం" -అవిషేక్ దాల్మియా, బంగాల్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి
సంప్రదాయ పద్ధతిలో కాకుండా ఈ డే/నైట్ టెస్టుకు తొలి విరామం.. టీ(20 నిమిషాలు), ఆ తర్వాత సప్పర్ బ్రేక్(40 నిమిషాలు) ఉంటుంది. అంటే మూడో సెషన్స్లో అర్ధభాగం ఫ్లడ్లైట్ల వెలుగులో జరగనుంది.
![eden gardens ground](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4903467_eden-gardens.jpg)
ఇది చదవండి: గులాబీ బంతితోనే భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్టు