ETV Bharat / sports

'యోయో టెస్టులో కోహ్లీనే మించిపోయాడు'

క్రీడాకారులకు చేసే యోయో టెస్టులో టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీనే మించిపోయాడు భారత క్రికెటర్​ అహ్మద్​ బాండే. తన ఫిట్​నెస్​కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను 'ఈటీవీ భారత్'​తో పంచుకున్నాడు.

author img

By

Published : Oct 27, 2020, 4:12 PM IST

ahmad bandey
అహ్మద్​ బాండే
అహ్మద్​ బాండే

ఏళ్లు గడిచే కొద్దీ క్రమేపీ క్రికెట్​లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా క్రికెటర్లు శారీరక దారుఢ్యానికి ప్రాధాన్యమివ్వడం ప్రారంభించారు. ప్రస్తుతం టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ 'ఫిట్​నెస్​ కా బాప్'​గా ఎంతో మంది అథ్లెట్స్​కు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అయితే ఈ ఫిట్​నెస్​కు సంబంధించి క్రికెటర్లకు చేసే యోయో టెస్టులో కోహ్లీనే మించిపోయాడు మరో భారత క్రికెటర్​ అహ్మద్​ బాండే. ఈ విషయమై తాజాగా 'ఈటీవీ భారత్'​తో ముచ్చటించాడు.

మీ ఫిట్​నెస్​ రహస్యం ఏంటి?

ఫిట్​నెస్​లో నేనే నెంబర్​ వన్​ అని ఇటీవలే ప్రచురితమైన ఓ ఆర్టికల్​ ద్వారా తెలిసింది. క్రమం తప్పకుండా డైట్​ పాటిస్తూ కసరత్తులు చేయడమే నా ఫిట్​నెస్​ రహస్యం.

యోయో టెస్ట్​ అంటే ఏంటి?

20 మీటర్ల దూరంలో ఆటగాళ్లు పరుగెత్తాలి. అయితే పరుగెత్తే సమయంలో బీప్ శబ్దం వచ్చిన సమయంలో ఆటగాళ్లు వెనక్కి పరుగెత్తాల్సి ఉంటుంది. ప్రతి నిమిషం తర్వాత బీప్ శబ్దాలు త్వరత్వరగా వస్తాయి. ఆ సమయానికి ఆటగాళ్లు నిర్ణీత సరిహద్దును చేరుకోవాలి. ఒక వేళ అలా చేరుకోకపోతే మరో రెండు బీప్ శబ్దాల లోపుగా వారు తమ లక్ష్యానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా సాఫ్ట్ వేర్ ఆధారంగా నిర్వహిస్తారు. ఆటగాళ్లు తమ సామర్థ్యం మేరకు దాదాపు గంటకు ఎనిమిది కోలోమీటర్ల వేగం నుంచి 22, 23 కిలోమీటర్లు పరుగెత్తుతుంటారు. ప్రస్తుతం టీమ్​ఇండియా ఆటగాళ్లకు బీసీసీఐ 17.4 స్కోరును ప్రామాణికంగా నిర్ణయించింది. అయితే దాన్ని నేను అధిగమించి 19.2,19.4 స్కోర్​ను సాధించా.

డైట్​ ఎలా తీసుకుంటారు? మీ దృష్టిలో ఫిట్​నెస్​లో అతిముఖ్యమైన అంశం ఏంటి?

చాలా జాగ్రత్తగా డైట్​ ఫాలో అవుతా. కొవ్వు పదార్థాలు, చిరుతిండి వంటివి ముట్టుకోను. దీంతో నా శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఫలితంగా శరీరానికి ప్రాణవాయువు సరైన మోతాదులో అందుతుంది. శరీరం బాగా సహకరిస్తుంది.

లాక్​డౌన్​లో ఫిట్​నెస్​ కోసం ఏమి చేశారు?

లాక్​డౌన్​ వల్ల దాదాపు ఆరు, ఏడు నెలలపాటు జిమ్​కు వెళ్లే అవకాశం దొరకలేదు. బయటకు వెళ్లి ఎటువంటి శిక్షణ చేయడం కుదరలేదు. జిమ్​కు సంబంధించిన కొన్ని పరికరాలను కొని ముందే ఇంటికి తెచ్చుకున్నా. వాటితోనే నేను కసరత్తులు చేసేవాడిని. దీంతో పాటు డైట్​ కూడా పాటించా.

టీమ్​ఇండియా యోయో ప్రామాణిక స్కోర్ 17.4గా ఉండగా.. కోహ్లీ 19, మనీశ్ పాండే 19.2 స్కోర్​తో ముందున్నారు.

ఇదీ చూడండి 'రోహిత్​కు నిజంగానే గాయం అయిందా ?'

అహ్మద్​ బాండే

ఏళ్లు గడిచే కొద్దీ క్రమేపీ క్రికెట్​లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా క్రికెటర్లు శారీరక దారుఢ్యానికి ప్రాధాన్యమివ్వడం ప్రారంభించారు. ప్రస్తుతం టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ 'ఫిట్​నెస్​ కా బాప్'​గా ఎంతో మంది అథ్లెట్స్​కు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అయితే ఈ ఫిట్​నెస్​కు సంబంధించి క్రికెటర్లకు చేసే యోయో టెస్టులో కోహ్లీనే మించిపోయాడు మరో భారత క్రికెటర్​ అహ్మద్​ బాండే. ఈ విషయమై తాజాగా 'ఈటీవీ భారత్'​తో ముచ్చటించాడు.

మీ ఫిట్​నెస్​ రహస్యం ఏంటి?

ఫిట్​నెస్​లో నేనే నెంబర్​ వన్​ అని ఇటీవలే ప్రచురితమైన ఓ ఆర్టికల్​ ద్వారా తెలిసింది. క్రమం తప్పకుండా డైట్​ పాటిస్తూ కసరత్తులు చేయడమే నా ఫిట్​నెస్​ రహస్యం.

యోయో టెస్ట్​ అంటే ఏంటి?

20 మీటర్ల దూరంలో ఆటగాళ్లు పరుగెత్తాలి. అయితే పరుగెత్తే సమయంలో బీప్ శబ్దం వచ్చిన సమయంలో ఆటగాళ్లు వెనక్కి పరుగెత్తాల్సి ఉంటుంది. ప్రతి నిమిషం తర్వాత బీప్ శబ్దాలు త్వరత్వరగా వస్తాయి. ఆ సమయానికి ఆటగాళ్లు నిర్ణీత సరిహద్దును చేరుకోవాలి. ఒక వేళ అలా చేరుకోకపోతే మరో రెండు బీప్ శబ్దాల లోపుగా వారు తమ లక్ష్యానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా సాఫ్ట్ వేర్ ఆధారంగా నిర్వహిస్తారు. ఆటగాళ్లు తమ సామర్థ్యం మేరకు దాదాపు గంటకు ఎనిమిది కోలోమీటర్ల వేగం నుంచి 22, 23 కిలోమీటర్లు పరుగెత్తుతుంటారు. ప్రస్తుతం టీమ్​ఇండియా ఆటగాళ్లకు బీసీసీఐ 17.4 స్కోరును ప్రామాణికంగా నిర్ణయించింది. అయితే దాన్ని నేను అధిగమించి 19.2,19.4 స్కోర్​ను సాధించా.

డైట్​ ఎలా తీసుకుంటారు? మీ దృష్టిలో ఫిట్​నెస్​లో అతిముఖ్యమైన అంశం ఏంటి?

చాలా జాగ్రత్తగా డైట్​ ఫాలో అవుతా. కొవ్వు పదార్థాలు, చిరుతిండి వంటివి ముట్టుకోను. దీంతో నా శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఫలితంగా శరీరానికి ప్రాణవాయువు సరైన మోతాదులో అందుతుంది. శరీరం బాగా సహకరిస్తుంది.

లాక్​డౌన్​లో ఫిట్​నెస్​ కోసం ఏమి చేశారు?

లాక్​డౌన్​ వల్ల దాదాపు ఆరు, ఏడు నెలలపాటు జిమ్​కు వెళ్లే అవకాశం దొరకలేదు. బయటకు వెళ్లి ఎటువంటి శిక్షణ చేయడం కుదరలేదు. జిమ్​కు సంబంధించిన కొన్ని పరికరాలను కొని ముందే ఇంటికి తెచ్చుకున్నా. వాటితోనే నేను కసరత్తులు చేసేవాడిని. దీంతో పాటు డైట్​ కూడా పాటించా.

టీమ్​ఇండియా యోయో ప్రామాణిక స్కోర్ 17.4గా ఉండగా.. కోహ్లీ 19, మనీశ్ పాండే 19.2 స్కోర్​తో ముందున్నారు.

ఇదీ చూడండి 'రోహిత్​కు నిజంగానే గాయం అయిందా ?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.