ETV Bharat / sports

ఆ ప్రణాళిక బాగా పనిచేసింది : రహానె

author img

By

Published : Dec 29, 2020, 11:09 AM IST

ఐదుగురు బౌలర్ల ప్రణాళిక బాగా ఉపయోగపడిందని చెప్పిన టీమ్​ఇండియా క్రికెటర్​ అజింక్యా రహానె.. ఆసీస్​పై రెండో టెస్టు గెలిచినప్పటికీ తాము నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నాడు. ఈ మ్యాచ్​లో గిల్​, సిరాజ్​ అదరగొట్టారని కితాబిచ్చాడు.

rahaney
రహానె

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టుతో టెస్టు అరంగేట్రం చేసిన టీమ్​ఇండియా ఆటగాళ్లు శుభమన్ గిల్​, మహ్మద్​ సిరాజ్​ను ప్రశంసించాడు భారత జట్టు తాత్కాలిక సారథి అజింక్యా రహానె. వీరిద్దరు అద్భుతంగా ఆడారని కొనియాడాడు. బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్​పై గెలిచిన అనంతరం మాట్లాడిన రహానె పలు అంశాలపై మ ాట్లాడాడు.

"ఐదుగురు బౌలర్ల ప్రణాళిక చాలా బాగా పనిచేసింది. గిల్​ ఫస్ట్​ క్లాస్​ కెరీర్​ గురించి మనందరికీ తెలిసిందే. ఆ అనుభవంతోనే ఈ పోరులో బాగా తీవ్రతతో ఆడాడు. అలాగే సిరాజ్​ కూడా అద్భుతంగా బౌలింగ్​ చేశాడు. నిజానికి కొత్తగా వచ్చేవాళ్లు సరిగ్గా ఆడలేరు. కానీ వీరిద్దరూ మంచి ప్రదర్శన చేశారు. ప్రతిఒక్కరూ తీవ్రతతో ఆడారు. అడిలైడ్​(తొలి) టెస్టులో ఒక్క గంటలో అంతా తారుమారైపోయింది. కాబట్టి రెండో టెస్టు గెలిచినప్పటికీ మేము నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని నా అభిప్రాయం. రెండో ఇన్నింగ్స్​లో ఆసీస్​ చివరి ఐదు వికెట్లను తమకు తామే సమర్పించుకుంది. ఉమేశ్​ యాదవ్​ కోలుకుంటున్నాడు. మూడో టెస్టులో అతడు ఆడే విషయమై మేనేజ్​మెంట్​, వైద్య బృందం నిర్ణయం తీసుకుంటారు. నిన్ననే రోహిత్​తో మాట్లాడాను. అతడి రాక కోసం టీమ్​ఇండియా ఎదురుచూస్తోంది. అలానే జట్టులో కలవడం కోసం అతను కూడా ఎంతో ఆత్రుతగా ఉన్నాడు."

-రహానె, టీమ్​ఇండియా క్రికెటర్​.

నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో తొలి టెస్టులో ఆసీస్​ గెలవగా.. రెండో మ్యాచులో టీమ్​ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి 1-1తో సిరీస్​ను సమం చేసింది. సిడ్నీ వేదికగా మూడో టెస్టు జనవరి 7నుంచి ప్రారంభంకానుంది. రెండో పోరు నుంచి సారథి కోహ్లీ గైర్హాజరీ కారణంగా రహానె తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు.

team india
టీమ్​ఇండియా

ఇదీ చూడండి : ఆసీస్​పై భారత్ విజయం.. సిరీస్​ 1-1తో సమం

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టుతో టెస్టు అరంగేట్రం చేసిన టీమ్​ఇండియా ఆటగాళ్లు శుభమన్ గిల్​, మహ్మద్​ సిరాజ్​ను ప్రశంసించాడు భారత జట్టు తాత్కాలిక సారథి అజింక్యా రహానె. వీరిద్దరు అద్భుతంగా ఆడారని కొనియాడాడు. బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్​పై గెలిచిన అనంతరం మాట్లాడిన రహానె పలు అంశాలపై మ ాట్లాడాడు.

"ఐదుగురు బౌలర్ల ప్రణాళిక చాలా బాగా పనిచేసింది. గిల్​ ఫస్ట్​ క్లాస్​ కెరీర్​ గురించి మనందరికీ తెలిసిందే. ఆ అనుభవంతోనే ఈ పోరులో బాగా తీవ్రతతో ఆడాడు. అలాగే సిరాజ్​ కూడా అద్భుతంగా బౌలింగ్​ చేశాడు. నిజానికి కొత్తగా వచ్చేవాళ్లు సరిగ్గా ఆడలేరు. కానీ వీరిద్దరూ మంచి ప్రదర్శన చేశారు. ప్రతిఒక్కరూ తీవ్రతతో ఆడారు. అడిలైడ్​(తొలి) టెస్టులో ఒక్క గంటలో అంతా తారుమారైపోయింది. కాబట్టి రెండో టెస్టు గెలిచినప్పటికీ మేము నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని నా అభిప్రాయం. రెండో ఇన్నింగ్స్​లో ఆసీస్​ చివరి ఐదు వికెట్లను తమకు తామే సమర్పించుకుంది. ఉమేశ్​ యాదవ్​ కోలుకుంటున్నాడు. మూడో టెస్టులో అతడు ఆడే విషయమై మేనేజ్​మెంట్​, వైద్య బృందం నిర్ణయం తీసుకుంటారు. నిన్ననే రోహిత్​తో మాట్లాడాను. అతడి రాక కోసం టీమ్​ఇండియా ఎదురుచూస్తోంది. అలానే జట్టులో కలవడం కోసం అతను కూడా ఎంతో ఆత్రుతగా ఉన్నాడు."

-రహానె, టీమ్​ఇండియా క్రికెటర్​.

నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో తొలి టెస్టులో ఆసీస్​ గెలవగా.. రెండో మ్యాచులో టీమ్​ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి 1-1తో సిరీస్​ను సమం చేసింది. సిడ్నీ వేదికగా మూడో టెస్టు జనవరి 7నుంచి ప్రారంభంకానుంది. రెండో పోరు నుంచి సారథి కోహ్లీ గైర్హాజరీ కారణంగా రహానె తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు.

team india
టీమ్​ఇండియా

ఇదీ చూడండి : ఆసీస్​పై భారత్ విజయం.. సిరీస్​ 1-1తో సమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.