టీమ్ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ లాక్డౌన్ సమయంలో టిక్టాక్ వీడియోలతో అభిమానులను అలరించాడు. నిత్యం ఏదో ఒక వీడియోతో ఆకట్టుకునేవాడు. ఫన్నీ వీడియోలతో బాగా ప్రాచుర్యం పొందాడు. అలాగే ఏ క్రికెటర్ అయినా ఆన్లైన్లో కనిపిస్తే చాలు చటుక్కున వాళ్ల మధ్య దూరిపోయి సరదా జోక్లతో కవ్వించేవాడు. ఈ క్రమంలోనే అతడి వీడియోలు చూసి క్రిస్గేల్, రోహిత్శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లు అతడిపై కామెంట్లు చేశారు. ఇక లాక్డౌన్ అనంతరం ధనశ్రీతో నిశ్చితార్థం చేసుకున్న యూజీ.. ఆ ఫొటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో పంచుకొని.. ఫ్యాన్స్కు శుభవార్త చెప్పాడు. తాజాగా ధనశ్రీతో కలిసి ఓ వీడియో చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఈ వీడియోలో కాబోయే దంపతులిద్దరూ అదరగొట్టారు. తమ నటనతో ఆ పాటకు తగ్గ హావభావాలు పలికించి నెటిజన్లను ఫిదా చేశారు. ఆ వీడియో చూసిన వెస్టిండీస్ బ్యాట్స్మన్ క్రిస్గేల్ మరోసారి చాహల్కు వార్నింగ్ ఇచ్చాడు. "చాహల్ ఇప్పటికే చాలా చేశావు. నేనిప్పుడు నీ ఇన్స్టాగ్రామ్ను రిపోర్ట్ చేస్తున్నా" అంటూ హెచ్చరించాడు. అయితే, ఇలా సరదాకే కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే గేల్ ఆ కామెంట్లో నవ్వుతున్న ఎమోజీలు జతచేశాడు.