ETV Bharat / sports

ఐపీఎల్​లో 'ఫిక్సింగ్​'పై ప్రత్యేక నిఘా నేత్రం

author img

By

Published : Sep 16, 2020, 7:15 PM IST

ఈ ఏడాది ఐపీఎల్​లో అవినీతికి సంబంధించి ఎటువంటి అవకతవకలు జరగకుండా గట్టి నిఘా పెట్టింది బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం. స్పాట్​ ఫిక్సింగ్​ను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఫ్రాడ్​ డిటెక్షన్​ సర్వీసెస్​ను వినియోగించనుంది. ఈ మేరకు యూకేకు చెందిన ప్రముఖ స్పోర్ట్స్​ర్యాడర్​ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

IPL
ఐపీఎల్​

ఐపీఎల్ 13వ సీజన్​​లో మ్యాచ్​ ఫిక్సింగ్​ జరగకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటోంది బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం(ఏసీయూ). త్వరలో ప్రారంభంకానున్న ఈ మెగాలీగ్​పై గట్టి నిఘా పెట్టనుంది. ఈ మేరకు యూకేకు చెందిన ప్రముఖ స్పోర్ట్స్​​ర్యాడర్​ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సీజన్​లో బెట్టింగ్​, ఇతర అవినీతి కార్యకలాపాలను అరిక్టటడానికి సదరు కంపెనీ సేవలను(ఫ్రాడ్​ డిటెక్షన్​ సర్వీసెస్) ఉపయోగించుకోనున్నారు. ఈ విషయాన్ని భారత క్రికెట్​ బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి.

ఇప్పటికే స్పోర్ట్స్​ర్యాడర్​ సేవలను ప్రపంచవ్యాప్తంగా ఫిఫా, యుఈఎఫ్​ఏ సహా పలు లీగుల్లో వినియోగిస్తున్నారు.

భారత మహిళా క్రికెట్ జట్టుతో పాటు తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్)లో గతేడాది ఫిక్సింగ్ కలకలం రేగింది. అప్పటినుంచి క్రికెటర్లు సహా పలువురు సిబ్బందిపై గట్టి నిఘా పెట్టింది భారత క్రికెట్​ బోర్డు.

దుబాయ్​ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10వరకు బయోసెక్యూర్​ వాతావరణంలో.. ఐపీఎల్​ జరగనుంది. తొలి మ్యాచ్​లో..​ ధోనీ నేతృత్వంలోని చెన్నై జట్టు, రోహిత్​ శర్మ నేతృత్వంలోని ముంబయి ఇండియన్స్​ తలపడనున్నాయి.​

ఇదీ చూడండి కుంబ్లే ఉండగా టెన్షన్​ ఎందుకు? : కేఎల్​ రాహుల్​

ఐపీఎల్ 13వ సీజన్​​లో మ్యాచ్​ ఫిక్సింగ్​ జరగకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటోంది బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం(ఏసీయూ). త్వరలో ప్రారంభంకానున్న ఈ మెగాలీగ్​పై గట్టి నిఘా పెట్టనుంది. ఈ మేరకు యూకేకు చెందిన ప్రముఖ స్పోర్ట్స్​​ర్యాడర్​ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సీజన్​లో బెట్టింగ్​, ఇతర అవినీతి కార్యకలాపాలను అరిక్టటడానికి సదరు కంపెనీ సేవలను(ఫ్రాడ్​ డిటెక్షన్​ సర్వీసెస్) ఉపయోగించుకోనున్నారు. ఈ విషయాన్ని భారత క్రికెట్​ బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి.

ఇప్పటికే స్పోర్ట్స్​ర్యాడర్​ సేవలను ప్రపంచవ్యాప్తంగా ఫిఫా, యుఈఎఫ్​ఏ సహా పలు లీగుల్లో వినియోగిస్తున్నారు.

భారత మహిళా క్రికెట్ జట్టుతో పాటు తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్)లో గతేడాది ఫిక్సింగ్ కలకలం రేగింది. అప్పటినుంచి క్రికెటర్లు సహా పలువురు సిబ్బందిపై గట్టి నిఘా పెట్టింది భారత క్రికెట్​ బోర్డు.

దుబాయ్​ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10వరకు బయోసెక్యూర్​ వాతావరణంలో.. ఐపీఎల్​ జరగనుంది. తొలి మ్యాచ్​లో..​ ధోనీ నేతృత్వంలోని చెన్నై జట్టు, రోహిత్​ శర్మ నేతృత్వంలోని ముంబయి ఇండియన్స్​ తలపడనున్నాయి.​

ఇదీ చూడండి కుంబ్లే ఉండగా టెన్షన్​ ఎందుకు? : కేఎల్​ రాహుల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.