టీమ్ఇండియా కిట్ స్పాన్సర్షిప్ హక్కులను ఎమ్పీఎల్ దక్కించుకుంది. ఈ సంస్థతో ఈ ఏడాది నవంబరు నుంచి 2023 డిసెంబరు(మూడేళ్లు) వరకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది బీసీసీఐ. దీని ద్వారా ఈ మూడేళ్ల కాలంలో జరిగే ఒక్కో మ్యాచ్కు రూ.65లక్షలు ఆర్జించనుంది. ఈ విషయాన్ని బోర్డుకు చెందిన ఓ అధికారి స్పష్టం చేశారు.
అంతకముందు టీమ్ ఇండియా కిట్ స్పాన్సర్ ఉన్న నైకీ సంస్థ.. కొన్ని అనివార్య కారణాలు తప్పుకుంది. అనంతరం కొత్త బిడ్లను ఆహ్వానించింది బోర్డు.
ఆస్ట్రేలియా పర్యటన
కరోనా తర్వాత టీమ్ఇండియా త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా నవంబరు 27 నుంచి జనవరి 19 మధ్య తలో మూడు వన్డేలు, టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది.
ఇదీ చూడండి: