ETV Bharat / sports

WTC Final: భారత్ vs న్యూజిలాండ్.. విజేత ఎవరు?

author img

By

Published : Jun 17, 2021, 5:31 PM IST

తొలి టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్​కు సర్వం సిద్ధం. విజేత కావాలని భారత్, న్యూజిలాండ్ ప్లాన్స్ వేస్తూ, అన్ని అస్త్రాలను రెడీ చేసుకుంటున్నాయి. అయితే ఈ మ్యాచ్​ ఎప్పుడు? ఎక్కడ? జరగతుంది. దీని గురించి పూర్తి సమాచారం పాయింట్ల రూపంలో మీకోసం.

India vs New Zealand World Test Championship final
కోహ్లీ విలియమ్సన్
  1. మొత్తంగా టెస్టు ఛాంపియన్​షిప్​లో 17 మ్యాచ్​లాడిన టీమ్​ఇండియా.. 12 గెలిచింది. 72.2 శాతం విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి, ఫైనల్​కు అర్హత సాధించింది. న్యూజిలాండ్ 11 మ్యాచ్​ల్లో 7 గెలిచి, 70 శాతం విజయాలతో రెండోస్థానంలో నిలిచి, తుదిపోరుకు వచ్చింది.
  2. సౌథాంప్టన్​ వేదికగా జూన్ 18-22 మధ్య జరిగే ఈ మ్యాచ్​లో టీమ్​ఇండియా రెట్రో లుక్​ జెర్సీ​తో కనిపించనుంది. 1980ల నాటి జెర్సీని ఇది పోలి ఉంటుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్​ మొదలవుతుంది.
    team india
    టీమ్​ఇండియా జట్టు
  3. ఈ మ్యాచ్​లో గెలిచిన జట్టుకు రూ.11.71 కోట్లు లభించనుండగా, ఓడిన టీమ్​కు రూ.5.85 కోట్లు దక్కనున్నాయి.
  4. ఐదు రోజులపాటు జరగనున్న ఈ టెస్టు.. ఒకవేళ డ్రా, టై అయితే ఇరుజట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు. ఆరో రోజును రిజర్వ్​డేగా ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది.
  5. భారత స్పిన్నర్ అశ్విన్ మరో నాలుగు వికెట్లు తీస్తే.. ఈ ఛాంపియన్​షిప్​లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్​గా నిలుస్తాడు. ప్రస్తుతం అశ్విన్ 67, కమిన్స్ 70 వికెట్లతో ఉన్నారు.
  6. కరోనా ప్రభావం తర్వాత క్రికెట్​లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఈ పోరుకు అభిమానులను అనుమతించారు. దీంతో ఒక్కో టిక్కెట్ రూ.2 లక్షలకు అమ్ముడుపోయినట్లు సదరు టిక్కెట్లు అమ్మే ఏజెన్సీ నిర్వహకులు వెల్లడించారు.
    kohli WTC final
    కెప్టెన్ కోహ్లీ
  7. ఈ మ్యాచ్​ చూసేందుకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జైషా కూడా వెళ్లనున్నారు.
  8. ఈ మ్యాచ్​కు మన దేశం నుంచి సునీల్​ గావస్కర్​, దినేశ్​ కార్తిక్ కామెంటరీ చెప్పనున్నారు.
  9. స్టార్ స్పోర్ట్స్.. ఈ టెస్టును ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ టెలికాస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది.
  10. ఈ మ్యాచ్​ కోసం పేస్, బౌన్సింగ్ పిచ్​ను సిద్ధం చేస్తున్నట్లు క్యూరేటర్ సైమన్​లీ చెప్పారు.
    World Test Championship final stadium
    సౌథాంప్టన్ మైదానం
  11. ఈ మ్యాచ్​కు భారీ వర్ష సూచన ఉందని సమాచారం. దాదాపు 80 శాతం మేర వర్షం కురవొచ్చని పలు వెబ్​సైట్లు చెబుతున్నాయి.

జట్లు

భారత్: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రహానె(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, గిల్, పుజారా, విహారి, పంత్, సాహా, అశ్విన్, జడేజా, బుమ్రా, ఇషాంత్, షమీ, ఉమేష్ యాదవ్, సిరాజ్.

న్యూజిలాండ్: విలియమ్సన్​(కెప్టెన్​), టామ్​ బ్లండెల్​, బౌల్ట్​,​ కాన్వే, గ్రాండ్​హోమ్​, హెన్రీ, జెమీసన్​, లాథమ్​, నికోలస్​, అజాజ్​ పటేల్​, సౌథీ, టేలర్​, వాగ్నర్​, వాట్లింగ్​, విల్​ యంగ్​.

ఇవీ చదవండి:

  1. మొత్తంగా టెస్టు ఛాంపియన్​షిప్​లో 17 మ్యాచ్​లాడిన టీమ్​ఇండియా.. 12 గెలిచింది. 72.2 శాతం విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి, ఫైనల్​కు అర్హత సాధించింది. న్యూజిలాండ్ 11 మ్యాచ్​ల్లో 7 గెలిచి, 70 శాతం విజయాలతో రెండోస్థానంలో నిలిచి, తుదిపోరుకు వచ్చింది.
  2. సౌథాంప్టన్​ వేదికగా జూన్ 18-22 మధ్య జరిగే ఈ మ్యాచ్​లో టీమ్​ఇండియా రెట్రో లుక్​ జెర్సీ​తో కనిపించనుంది. 1980ల నాటి జెర్సీని ఇది పోలి ఉంటుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్​ మొదలవుతుంది.
    team india
    టీమ్​ఇండియా జట్టు
  3. ఈ మ్యాచ్​లో గెలిచిన జట్టుకు రూ.11.71 కోట్లు లభించనుండగా, ఓడిన టీమ్​కు రూ.5.85 కోట్లు దక్కనున్నాయి.
  4. ఐదు రోజులపాటు జరగనున్న ఈ టెస్టు.. ఒకవేళ డ్రా, టై అయితే ఇరుజట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు. ఆరో రోజును రిజర్వ్​డేగా ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది.
  5. భారత స్పిన్నర్ అశ్విన్ మరో నాలుగు వికెట్లు తీస్తే.. ఈ ఛాంపియన్​షిప్​లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్​గా నిలుస్తాడు. ప్రస్తుతం అశ్విన్ 67, కమిన్స్ 70 వికెట్లతో ఉన్నారు.
  6. కరోనా ప్రభావం తర్వాత క్రికెట్​లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఈ పోరుకు అభిమానులను అనుమతించారు. దీంతో ఒక్కో టిక్కెట్ రూ.2 లక్షలకు అమ్ముడుపోయినట్లు సదరు టిక్కెట్లు అమ్మే ఏజెన్సీ నిర్వహకులు వెల్లడించారు.
    kohli WTC final
    కెప్టెన్ కోహ్లీ
  7. ఈ మ్యాచ్​ చూసేందుకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జైషా కూడా వెళ్లనున్నారు.
  8. ఈ మ్యాచ్​కు మన దేశం నుంచి సునీల్​ గావస్కర్​, దినేశ్​ కార్తిక్ కామెంటరీ చెప్పనున్నారు.
  9. స్టార్ స్పోర్ట్స్.. ఈ టెస్టును ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ టెలికాస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది.
  10. ఈ మ్యాచ్​ కోసం పేస్, బౌన్సింగ్ పిచ్​ను సిద్ధం చేస్తున్నట్లు క్యూరేటర్ సైమన్​లీ చెప్పారు.
    World Test Championship final stadium
    సౌథాంప్టన్ మైదానం
  11. ఈ మ్యాచ్​కు భారీ వర్ష సూచన ఉందని సమాచారం. దాదాపు 80 శాతం మేర వర్షం కురవొచ్చని పలు వెబ్​సైట్లు చెబుతున్నాయి.

జట్లు

భారత్: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రహానె(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, గిల్, పుజారా, విహారి, పంత్, సాహా, అశ్విన్, జడేజా, బుమ్రా, ఇషాంత్, షమీ, ఉమేష్ యాదవ్, సిరాజ్.

న్యూజిలాండ్: విలియమ్సన్​(కెప్టెన్​), టామ్​ బ్లండెల్​, బౌల్ట్​,​ కాన్వే, గ్రాండ్​హోమ్​, హెన్రీ, జెమీసన్​, లాథమ్​, నికోలస్​, అజాజ్​ పటేల్​, సౌథీ, టేలర్​, వాగ్నర్​, వాట్లింగ్​, విల్​ యంగ్​.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.