భారత బ్యాడ్మింటన్ మహిళా సింగిల్స్ కోచ్ 'కిమ్ జీ హ్యూన్' తన పదవికి రాజీనామా చేశారు. పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలవడంలో ఆమె కీలకపాత్ర పోషించారు.
దక్షిణ కొరియాకు చెందిన కిమ్... వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కిమ్ రాజీనామా చేయడం వాస్తవమని... ఆమె భర్త అనారోగ్యం కారణంగా ఆమె పదవి నుంచి వైదొలిగారని బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపిచంద్ చెప్పారు.
ఒలింపిక్స్ ముందు షాక్...
ఒలింపిక్స్కు పది నెలల సమయమే ఉన్న సమయంలో కిమ్ రాజీనామా భారత్కు పెద్ద ఎదురుదెబ్బ. సింధు లాంటి అగ్రశ్రేణి క్రీడాకారిణులకు తర్ఫీదునివ్వడంలో ఈమె కీలక పాత్ర పోషించారు. కిమ్ స్థానంలో త్వరగా కొత్త కోచ్ను నియమించాల్సి ఉందని గోపిచంద్ తెలిపాడు.
"నేను ఒలింపిక్స్కు సన్నద్దమవుతున్న దశలో కిమ్ రాజీనామా చేయడం దురదృష్టకరం. ఆమె భర్త త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. బ్యాడ్మింటన్ అసోసియేషన్ అన్ని జాగ్రత్తలు తీసుకొని త్వరగా మరో కోచ్ను నియమిస్తుందని ఆశిస్తున్నా"
-- పీవీ సింధు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.
ప్రపంచ ఛాంపియన్షిప్లో పసిడి గెలిచిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు... తన గెలుపు వెనుక ఈ విదేశీ కోచ్ సాయం ఉందని చెప్పింది. నేటి నుంచి ప్రారంభంకానున్న కొరియా ఓపెన్లో తెలుగమ్మాయి ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది.
ఇదీ చదవండి..