ETV Bharat / sports

కరోనా పరీక్ష పేరుతో షట్లర్​ శ్రీకాంత్​పై హింస! - thailand open kidambi srikanth blood

బ్యాడ్మింటన్​ టోర్నీలో పాల్గొనడానికి మాత్రమే థాయ్​లాండ్ వచ్చామని.. రక్తం చిందించడానికి కాదంటూ భారత స్టార్​ షట్లర్​ కిదాంబి శ్రీకాంత్​ ట్వీట్​ చేశాడు. థాయ్​లాండ్​ ఓపెన్​ కోసం అక్కడికి చేరుకున్న శ్రీకాంత్​.. సోమవారం తనకు జరిపిన కరోనా పరీక్షల్లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన ముక్కు నుంచి రక్తం వచ్చినట్లు వెల్లడించాడు.

Srikanth
శ్రీకాంత్
author img

By

Published : Jan 12, 2021, 4:46 PM IST

Updated : Jan 12, 2021, 5:26 PM IST

థాయ్​లాండ్​ వైద్యులపై భారత్​​ బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ అసహనం వ్యక్తం చేశాడు. థాయ్​లాండ్​ ఓపెన్​లో పాల్గొనడానికి అక్కడి వెళ్లిన శ్రీకాంత్​.. వైద్యులు సరైన రీతిలో కరోనా పరీక్ష చేయలేదని ఆరోపించాడు. టోర్నీ కోసం థాయ్​లాండ్​ చేరుకున్న తర్వాత నాలుగు సార్లు కొవిడ్​ టెస్టు చేయించుకోగా.. సోమవారం జరిపిన పరీక్షల్లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన ముక్కులో గాయమై రక్తం వచ్చినట్లు వెల్లడించాడు. దానికి సంబంధించిన ఫొటోలను శ్రీకాంత్​ ట్విట్టర్​లో పంచుకున్నాడు.

srikanth
శ్రీకాంత్​ ట్వీట్​

"మేము ఇక్కడికి మ్యాచ్​ ఆడేందుకు మాత్రమే వచ్చాం. మా రక్తాన్ని చిందించడానికి కాదు. ఇక్కడికి చేరుకున్నాక నేను నాలుగు సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నాను. ఈ టెస్టులు చేసే విధానంలో నేను అసంతృప్తి చెందాను. దీన్ని నేను అంగీకరించను."

-కిడాంబి శ్రీకాంత్​, భారత స్టార్​ షట్లర్​​.

సోమవారం నుంచి ప్రారంభమైన ఈ టోర్నీ తొలి రౌండ్​లోనే భారత్​కు నిరాశ ఎదురైంది. డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్‌తో చేతిలో ప్రపంచ మాజీ ఛాంపియన్​ సింధు 21-16,24-26,13-21 తేడాతో పరాజయం చెందగా.. వంగ్చరొన్‌తో తలపడిన ప్రణీత్ ​16-21, 10-21 తేడాతో ఓటమిపాలయ్యాడు. మరోవైపు కరోనా సోకిన కారణంగా సైనా నెహ్వాల్​, హెచ్​ఎస్​ ప్రణయ్​ ఈ టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది.

ఇదీ చూడండి : థాయ్​లాండ్ ఓపెన్: తొలి రౌండ్లోనే సింధుకు షాక్

థాయ్​లాండ్​ వైద్యులపై భారత్​​ బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ అసహనం వ్యక్తం చేశాడు. థాయ్​లాండ్​ ఓపెన్​లో పాల్గొనడానికి అక్కడి వెళ్లిన శ్రీకాంత్​.. వైద్యులు సరైన రీతిలో కరోనా పరీక్ష చేయలేదని ఆరోపించాడు. టోర్నీ కోసం థాయ్​లాండ్​ చేరుకున్న తర్వాత నాలుగు సార్లు కొవిడ్​ టెస్టు చేయించుకోగా.. సోమవారం జరిపిన పరీక్షల్లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన ముక్కులో గాయమై రక్తం వచ్చినట్లు వెల్లడించాడు. దానికి సంబంధించిన ఫొటోలను శ్రీకాంత్​ ట్విట్టర్​లో పంచుకున్నాడు.

srikanth
శ్రీకాంత్​ ట్వీట్​

"మేము ఇక్కడికి మ్యాచ్​ ఆడేందుకు మాత్రమే వచ్చాం. మా రక్తాన్ని చిందించడానికి కాదు. ఇక్కడికి చేరుకున్నాక నేను నాలుగు సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నాను. ఈ టెస్టులు చేసే విధానంలో నేను అసంతృప్తి చెందాను. దీన్ని నేను అంగీకరించను."

-కిడాంబి శ్రీకాంత్​, భారత స్టార్​ షట్లర్​​.

సోమవారం నుంచి ప్రారంభమైన ఈ టోర్నీ తొలి రౌండ్​లోనే భారత్​కు నిరాశ ఎదురైంది. డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్‌తో చేతిలో ప్రపంచ మాజీ ఛాంపియన్​ సింధు 21-16,24-26,13-21 తేడాతో పరాజయం చెందగా.. వంగ్చరొన్‌తో తలపడిన ప్రణీత్ ​16-21, 10-21 తేడాతో ఓటమిపాలయ్యాడు. మరోవైపు కరోనా సోకిన కారణంగా సైనా నెహ్వాల్​, హెచ్​ఎస్​ ప్రణయ్​ ఈ టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది.

ఇదీ చూడండి : థాయ్​లాండ్ ఓపెన్: తొలి రౌండ్లోనే సింధుకు షాక్

Last Updated : Jan 12, 2021, 5:26 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.