ETV Bharat / sitara

ఆ క్షణాల్ని డబ్బుతో వెలకట్టలేం: విరుష్క

author img

By

Published : Apr 16, 2021, 6:40 PM IST

టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ, అతడి సతీమణి నటి అనుష్క శర్మ గతేడాది లాక్​డౌన్​లో మూగజీవాలకు ఆహారం అందిస్తూ మంచి మనసు చాటుకున్నారు. తాజాగా ఆ వీడియోను నెట్టింట షేర్ చేసింది అనుష్క.

Virushka
విరుష్క

టీమ్ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, అతడి సతీమణి నటి అనుష్కశర్మ జంతు ప్రేమికులు. ముఖ్యంగా శునకాలంటే ఈ జంటకి అమితమైన ప్రేమ. ఆకలితో అలమటించే మూగజీవాలకు ఎన్నోసార్లు ఆహారం అందించి వాటిపై తమ మమకారాన్ని చాటుకుంది విరుష్క జోడీ.

కరోనా కారణంగా గతేడాది చాలాకాలం పాటు క్రికెట్‌ మ్యాచులు, సినిమా షూటింగులు లేకపోవడం వల్ల విరుష్క జోడీ ఇంట్లోనే ఉంటూ సరదాగా గడిపింది. ఆ సమయంలో వీరిద్దరూ తమ పెంపుడు కుక్కలతో ఆడుకునేవారు. అప్పట్లో లాక్‌డౌన్‌ వల్ల దుకాణాలన్నీ మూతపడ్డాయి. వీధుల్లో ఉండే శునకాలకు ఆహారం దొరక్క ఆకలితో అలమటించేవి. ఆ సమయంలో ఈ జంట ఆహార పదార్థాలతో పాటు తమ పెంపుడు కుక్కలను తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లింది. వీరు తీసుకెళ్లిన తిండిని చూసిన శునకాలు వెంటనే దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చాయి. విరాట్‌, అనుష్కశర్మ వాటిని స్వయంగా చేతులతో పట్టుకుని ఆహారం అందించారు.

శునకాలతో గడిపిన ఆ క్షణాలను గుర్తుచేసుకుంటూ అనుష్కశర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో "కొన్ని ప్రత్యేకమైనవి. గతేడాది గడిపిన ఆ క్షణాలను డబ్బుతో విలువ కట్టలేం" అనే వ్యాఖ్య జత చేస్తూ వీడియోను పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓసారి మీరూ చూసేయండి!

టీమ్ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, అతడి సతీమణి నటి అనుష్కశర్మ జంతు ప్రేమికులు. ముఖ్యంగా శునకాలంటే ఈ జంటకి అమితమైన ప్రేమ. ఆకలితో అలమటించే మూగజీవాలకు ఎన్నోసార్లు ఆహారం అందించి వాటిపై తమ మమకారాన్ని చాటుకుంది విరుష్క జోడీ.

కరోనా కారణంగా గతేడాది చాలాకాలం పాటు క్రికెట్‌ మ్యాచులు, సినిమా షూటింగులు లేకపోవడం వల్ల విరుష్క జోడీ ఇంట్లోనే ఉంటూ సరదాగా గడిపింది. ఆ సమయంలో వీరిద్దరూ తమ పెంపుడు కుక్కలతో ఆడుకునేవారు. అప్పట్లో లాక్‌డౌన్‌ వల్ల దుకాణాలన్నీ మూతపడ్డాయి. వీధుల్లో ఉండే శునకాలకు ఆహారం దొరక్క ఆకలితో అలమటించేవి. ఆ సమయంలో ఈ జంట ఆహార పదార్థాలతో పాటు తమ పెంపుడు కుక్కలను తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లింది. వీరు తీసుకెళ్లిన తిండిని చూసిన శునకాలు వెంటనే దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చాయి. విరాట్‌, అనుష్కశర్మ వాటిని స్వయంగా చేతులతో పట్టుకుని ఆహారం అందించారు.

శునకాలతో గడిపిన ఆ క్షణాలను గుర్తుచేసుకుంటూ అనుష్కశర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో "కొన్ని ప్రత్యేకమైనవి. గతేడాది గడిపిన ఆ క్షణాలను డబ్బుతో విలువ కట్టలేం" అనే వ్యాఖ్య జత చేస్తూ వీడియోను పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓసారి మీరూ చూసేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.