బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ కరోనా నుంచి కోలుకున్నాడు. పరీక్షల అనంతరం నెగిటివ్గా తేలిందని సామాజిక మాధ్యమాల వేదికగా స్వయంగా వెల్లడించాడు. నవ్వుతున్న ఫొటోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. తాను కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
![Vicky Kaushal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/863347-vickykaushal-082919_1604newsroom_1618573012_868.jpg)
![Vicky Kaushal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11426803_p.jpg)
ఏప్రిల్ 5న విక్కీ, నటి భూమి పెడ్నేకర్ ఒకేసారి కరోనా బారినపడ్డారు. కాగా తాజాగా విక్కీ కోలుకోగా, భూమికి సంబంధించిన ఆరోగ్య వివరాలు తెలియాల్సి ఉంది. వీరిద్దరూ 'మిస్టర్. లీలే ఇన్ ముంబయి' సినిమాలో నటిస్తున్నారు.
ఇదీ చదవండి: ఆ బాధ తట్టుకోలేక ఏడ్చేశా: అనసూయ