ETV Bharat / sitara

ప్రకాశ్​రాజ్​ ఓటమి.. ముందే అర్ధమైంది..!

author img

By

Published : May 23, 2019, 2:50 PM IST

Updated : May 23, 2019, 3:16 PM IST

బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీ చేసిన ప్రకాశ్​రాజ్​.. ఎన్నికల్లో గెలుస్తానా, ఓడుతానా అనే విషయం కౌంటింగ్ మధ్యలోనే అర్ధం చేసుకున్నాడు. అందుకే లెక్కింపు కేంద్రం నుంచి మధ్యలోనే వెళ్లిపోయాడు. లౌకిక భారతదేశం కోసం ఎప్పటికీ కృషి చేస్తానంటూ ట్వీట్ చేశాడు. ఓటమి ఖరారైంది.

ప్రకాశ్​రాజ్​కు ఆ విషయం అర్ధమైంది..!

తొలిసారిగా లోక్​సభ ఎన్నికల బరిలో నిలిచిన నటుడు ప్రకాశ్​ రాజ్​ ఓటమిపాలయ్యారు. ఈ విషయం అతడికి మధ్యలోనే అర్ధమైందేమో అందుకే లెక్కింపు కేంద్రం నుంచి సగంలోనే వెళ్లిపోయాడు. బెంగళూరు సెంట్రల్​ నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేశాడీ బహుభాషా నటుడు.

ప్రస్తుతం ఈ స్థానం నుంచి భాజపా తరఫున పోటీ చేస్తున్న పీసీ మోహన్ ఆధిక్యంలో ఉన్నారు. ప్రకాశ్​రాజ్​కు ఆయనకు ఓట్ల వ్యత్యాసంలో భారీ తేడా ఉంది. పరిస్థితిని అర్ధం చేసుకున్న ఈ నటుడు... తను ఓడిపోవడం ఖాయమనే ఉద్దేశంతో ట్వీట్ చేశాడు.

"ఈ పరిస్థితి చూస్తే నాకు చెంపదెబ్బ కొట్టినట్టయింది. నేను నా మాటలపైనే నిలబడతాను. లౌకిక భారతదేశ నిర్మాణం కోసం ఎప్పటికీ కృషి చేస్తాను. కష్టమైన ఈ దారిలో ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ ప్రయాణంలో నాకు తోడ్పడిన వారందరికి కృతజ్ఞతలు" -ప్రకాశ్ రాజ్, నటుడు

  • a SOLID SLAP on my face ..as More ABUSE..TROLL..and HUMILIATION come my way..I WILL STAND MY GROUND ..My RESOLVE to FIGHT for SECULAR INDIA will continue..A TOUGH JOURNEY AHEAD HAS JUST BEGUN ..THANK YOU EVERYONE WHO WERE WITH ME IN THIS JOURNEY. .... JAI HIND

    — Prakash Raj (@prakashraaj) May 23, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

తొలిసారిగా లోక్​సభ ఎన్నికల బరిలో నిలిచిన నటుడు ప్రకాశ్​ రాజ్​ ఓటమిపాలయ్యారు. ఈ విషయం అతడికి మధ్యలోనే అర్ధమైందేమో అందుకే లెక్కింపు కేంద్రం నుంచి సగంలోనే వెళ్లిపోయాడు. బెంగళూరు సెంట్రల్​ నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేశాడీ బహుభాషా నటుడు.

ప్రస్తుతం ఈ స్థానం నుంచి భాజపా తరఫున పోటీ చేస్తున్న పీసీ మోహన్ ఆధిక్యంలో ఉన్నారు. ప్రకాశ్​రాజ్​కు ఆయనకు ఓట్ల వ్యత్యాసంలో భారీ తేడా ఉంది. పరిస్థితిని అర్ధం చేసుకున్న ఈ నటుడు... తను ఓడిపోవడం ఖాయమనే ఉద్దేశంతో ట్వీట్ చేశాడు.

"ఈ పరిస్థితి చూస్తే నాకు చెంపదెబ్బ కొట్టినట్టయింది. నేను నా మాటలపైనే నిలబడతాను. లౌకిక భారతదేశ నిర్మాణం కోసం ఎప్పటికీ కృషి చేస్తాను. కష్టమైన ఈ దారిలో ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ ప్రయాణంలో నాకు తోడ్పడిన వారందరికి కృతజ్ఞతలు" -ప్రకాశ్ రాజ్, నటుడు

  • a SOLID SLAP on my face ..as More ABUSE..TROLL..and HUMILIATION come my way..I WILL STAND MY GROUND ..My RESOLVE to FIGHT for SECULAR INDIA will continue..A TOUGH JOURNEY AHEAD HAS JUST BEGUN ..THANK YOU EVERYONE WHO WERE WITH ME IN THIS JOURNEY. .... JAI HIND

    — Prakash Raj (@prakashraaj) May 23, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

బెంగళూరు సెంట్రల్​లో గత రెండు పర్యాయాలు(2009,2014) గెలిచిన భాజపా అభ్యర్థి మోహన్ ఈసారీ గెలుపొందారు.

Intro:Body:Conclusion:
Last Updated : May 23, 2019, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.