టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. కరోనా కాలంలో ఎవరూ తన పుట్టినరోజు వేడుకలు(మే 20) చేయొద్దని కోరారు. ఇంటివద్దనే ఉండి లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనలను పాటించాలని సూచించారు. ప్రాణాలు, జీవనోపాధి కోల్పోయిన వారి కుటుంబాలకు అండగా నిలబడాలని పేర్కొన్నారు. ప్రపంచం కరోనాను జయించిన రోజు అందరం కలిసి వేడుకల్ని జరుపుకొందాం అని పిలుపునిచ్చారు.
కరోనా నుంచి కోలుకుంటున్నట్లు తెలిపిన తారక్.. త్వరలోనే వైరస్ను జయిస్తానని అన్నారు. ప్రస్తుతం ఆయన 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్నారు. ఆ తర్వాత కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నారు.