ETV Bharat / sitara

సుకుమార్​ను నామినేట్ చేసిన నాగ చైతన్య - శేఖర్ కమ్ములతో నాగ చైతన్య

కరోనా వైరస్ బారిన పడి విజేతలుగా నిలిచిన వారితో ప్రత్యేక చర్చా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఫేస్​బుక్ వేదికగా ఈ చర్చను ఆయన నిర్వహించారు. తర్వాత నాగ చైతన్యను నామినేట్ చేశారు. చైతూ కూడా సునీత అనే నర్సుతో ఆన్​లైన్​లో ముచ్చటించారు. ఇప్పుడు ఈ చర్చను ముందుకు తీసుకెళ్లాలంటూ డైరెక్టర్ సుకుమార్​ను కోరారు.

సుకుమార్​ను నామినేట్ చేసిన నాగ చైతన్య
సుకుమార్​ను నామినేట్ చేసిన నాగ చైతన్య
author img

By

Published : Aug 7, 2020, 7:55 PM IST

కరోనా వైరస్‌ బారినపడిన సామాన్యులు ఎలా విజేతలుగా నిలిచారనే విషయంపై ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఇటీవల ప్రత్యేక చర్చా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఫేస్‌బుక్‌ వేదికగా ఈ చర్చను ఆయన నిర్వహించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్యను నామినేట్‌ చేశారు. ఇటీవల చైతూ... సునీత అనే నర్సుతో ఆన్‌లైన్‌లో ముచ్చటించారు. ఇప్పుడు ఈ బృహత్‌ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటూ ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ను చైతన్య నామినేట్‌ చేశారు.

కొవిడ్‌-19ను జయించిన సునీత అనే నర్సుతో చైతన్య గత వారం ఆన్‌లైన్‌ ద్వారా ముచ్చటించారు. ఈ చర్చలో సునీత మాటలు చాలా సహాయకరంగా, స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని తెలిపారు. "‘కరోనా సోకిందని తెలియగానే ప్రతి ఒక్కరూ భయపడిపోతుంటారు. నిజానికి తీవ్ర భయం, ఒత్తిడికి గురవ్వడం వల్లే ఎక్కువ సమస్యలొస్తాయి. ఈ భయాలతోనే చాలా మందిలో వైరస్‌ లక్షణాలున్నా బయటకు చెప్పలేకపోతున్నారు. ఫలితంగా ప్రాణాపాయ పరిస్థితుల్ని కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ముందు ఇలాంటి అనవసర భయాల్ని వీడండి" అని నాగచైతన్య కోరారు.

కరోనా వైరస్‌ బారినపడిన సామాన్యులు ఎలా విజేతలుగా నిలిచారనే విషయంపై ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఇటీవల ప్రత్యేక చర్చా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఫేస్‌బుక్‌ వేదికగా ఈ చర్చను ఆయన నిర్వహించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్యను నామినేట్‌ చేశారు. ఇటీవల చైతూ... సునీత అనే నర్సుతో ఆన్‌లైన్‌లో ముచ్చటించారు. ఇప్పుడు ఈ బృహత్‌ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటూ ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ను చైతన్య నామినేట్‌ చేశారు.

కొవిడ్‌-19ను జయించిన సునీత అనే నర్సుతో చైతన్య గత వారం ఆన్‌లైన్‌ ద్వారా ముచ్చటించారు. ఈ చర్చలో సునీత మాటలు చాలా సహాయకరంగా, స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని తెలిపారు. "‘కరోనా సోకిందని తెలియగానే ప్రతి ఒక్కరూ భయపడిపోతుంటారు. నిజానికి తీవ్ర భయం, ఒత్తిడికి గురవ్వడం వల్లే ఎక్కువ సమస్యలొస్తాయి. ఈ భయాలతోనే చాలా మందిలో వైరస్‌ లక్షణాలున్నా బయటకు చెప్పలేకపోతున్నారు. ఫలితంగా ప్రాణాపాయ పరిస్థితుల్ని కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ముందు ఇలాంటి అనవసర భయాల్ని వీడండి" అని నాగచైతన్య కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.