ETV Bharat / sitara

శోభన్​బాబు వల్లే ఉన్నత స్థితిలో ఉన్నా: మురళీమోహన్ - shoban babu latest news

ఇటీవల జనవరి 20న శోభన్​బాబు జయంతిని పురస్కరించుకుని జరిగిన వీడియో కాన్ఫరెన్స్​లో సీనియర్ నటులు మురళీ మోహన్, చంద్రమోహన్​ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆయన వల్లే తాము ఇలా ఉన్నామని గుర్తు చేసుకున్నారు.

murali-mohan-chandra-mohan-about-soggadu-shoban-babu
శోభన్​బాబు వల్లే ఉన్నత స్థితిలో ఉన్నా: మురళీమోహన్
author img

By

Published : Jan 23, 2021, 9:57 PM IST

వెండితెర సోగ్గాడు శోభన్​బాబు సలహా పాటించడం వల్లే తాను ఈరోజు ఉన్నత స్థితిలో ఉన్నానని ప్రముఖ నటుడు మురళీమోహన్ చెప్పారు. నటుడిగా, వ్యక్తిగతంగా ఆయన ఎంతో గొప్ప మనిషని గుర్తుచేసుకున్నారు.

శోభన్​బాబు 85వ జయంతిని పురస్కరించుకుని వంశీ గ్లోబల్ అవార్డ్స్ అమెరికా- ఇండియా ఆధ్వర్యంలో ఆన్​లైన్​లో వేడుకలను నిర్వహించారు. అమెరికా గానకోకిల శారద ఆకునూరి పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశంలో సీనియర్ నటి జమునతోపాటు ప్రముఖ దర్శకులు కోదండరామిరెడ్డి, నటులు మురళీమోహన్, చంద్రమోహన్, దర్శకులు రేలంగి నర్సింహారావు, తదితరులు పాల్గొని శోభన్​బాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

సినీ పరిశ్రమ హైదరాబాద్​కు తరలిపోతుంటే తనను మాత్రం శోభన్​బాబు, మద్రాసులోనే ఉండిపొమ్మన్నారని సీనియర్ నటుడు చంద్రమోహన్ పేర్కొన్నారు. ఆయన సలహాతో సంపాదించిన ఆస్తులే ఈరోజు తనకు అండగా ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. ఏరా అని పిలిపించుకునే ఆత్మీయ మిత్రుడ్ని కోల్పోవడం ఎప్పటికీ లోటేనని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చంద్రమోహన్​ను వంశీ గ్లోబల్ పురస్కారంతో సత్కరించారు.

ఇది చదవండి: శోభన్​బాబు అందుకే నటనకు స్వస్తి చెప్పారు!

వెండితెర సోగ్గాడు శోభన్​బాబు సలహా పాటించడం వల్లే తాను ఈరోజు ఉన్నత స్థితిలో ఉన్నానని ప్రముఖ నటుడు మురళీమోహన్ చెప్పారు. నటుడిగా, వ్యక్తిగతంగా ఆయన ఎంతో గొప్ప మనిషని గుర్తుచేసుకున్నారు.

శోభన్​బాబు 85వ జయంతిని పురస్కరించుకుని వంశీ గ్లోబల్ అవార్డ్స్ అమెరికా- ఇండియా ఆధ్వర్యంలో ఆన్​లైన్​లో వేడుకలను నిర్వహించారు. అమెరికా గానకోకిల శారద ఆకునూరి పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశంలో సీనియర్ నటి జమునతోపాటు ప్రముఖ దర్శకులు కోదండరామిరెడ్డి, నటులు మురళీమోహన్, చంద్రమోహన్, దర్శకులు రేలంగి నర్సింహారావు, తదితరులు పాల్గొని శోభన్​బాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

సినీ పరిశ్రమ హైదరాబాద్​కు తరలిపోతుంటే తనను మాత్రం శోభన్​బాబు, మద్రాసులోనే ఉండిపొమ్మన్నారని సీనియర్ నటుడు చంద్రమోహన్ పేర్కొన్నారు. ఆయన సలహాతో సంపాదించిన ఆస్తులే ఈరోజు తనకు అండగా ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. ఏరా అని పిలిపించుకునే ఆత్మీయ మిత్రుడ్ని కోల్పోవడం ఎప్పటికీ లోటేనని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చంద్రమోహన్​ను వంశీ గ్లోబల్ పురస్కారంతో సత్కరించారు.

ఇది చదవండి: శోభన్​బాబు అందుకే నటనకు స్వస్తి చెప్పారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.