ETV Bharat / sitara

దద్దరిల్లిన 'సరిలేరు నీకెవ్వరు' టీవీ రేటింగ్స్

ఇటీవలే టీవీలో ప్రసారమైన 'సరిలేరు నీకెవ్వరు'.. అదిరిపోయే రేటింగ్స్ తెచ్చుకుంది. బుల్లితెరపై 'బాహుబలి' రికార్డులను అధిగమించింది.

author img

By

Published : Apr 2, 2020, 3:01 PM IST

దద్దరిల్లిన 'సరిలేరు నీకెవ్వరు' టీవీ రేటింగ్స్
మహేశ్​బాబు సరిలేరు నీకెవ్వరు

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన సూపర్​స్టార్ మహేశ్​బాబు 'సరిలేరు నీకెవ్వరు'.. థియేటర్లలో అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి, మహేశ్​ స్టామినా నిరూపించింది. ఇప్పుడు బుల్లితెరపైనా అదే స్థాయిలో సత్తా చాటింది. గత 15 ఏళ్లలో లేని విధంగా అదిరిపోయే రేటింగ్స్ సంపాదించింది.

ఈ ఉగాదికి, ఓ ప్రముఖ ఛానెల్​లో ప్రసారమైన 'సరిలేరు నీకెవ్వరు'.. బార్క్ వివరాల ప్రకారం 23.4 టీవీఆర్ తెచ్చుకుంది. ఇంతకుముందు బాహుబలి-2(22.70), బాహుబలి(21.84) సినిమాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అయితే తమ చిత్రంపై ఇంత ఆదరణ చూపిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు నిర్మాత అనిల్ సుంకర.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన సూపర్​స్టార్ మహేశ్​బాబు 'సరిలేరు నీకెవ్వరు'.. థియేటర్లలో అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి, మహేశ్​ స్టామినా నిరూపించింది. ఇప్పుడు బుల్లితెరపైనా అదే స్థాయిలో సత్తా చాటింది. గత 15 ఏళ్లలో లేని విధంగా అదిరిపోయే రేటింగ్స్ సంపాదించింది.

ఈ ఉగాదికి, ఓ ప్రముఖ ఛానెల్​లో ప్రసారమైన 'సరిలేరు నీకెవ్వరు'.. బార్క్ వివరాల ప్రకారం 23.4 టీవీఆర్ తెచ్చుకుంది. ఇంతకుముందు బాహుబలి-2(22.70), బాహుబలి(21.84) సినిమాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అయితే తమ చిత్రంపై ఇంత ఆదరణ చూపిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు నిర్మాత అనిల్ సుంకర.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.