ETV Bharat / sitara

'సుశాంత్​ను చూడటానికి రియాకు అనుమతిచ్చారా..?'

author img

By

Published : Aug 26, 2020, 10:19 PM IST

సుశాంత్​ మృతదేహాన్ని చూడటానికి నటి రియా చక్రవర్తిని ఎలా అనుమతించారని ముంబయి పోలీసులు, నగర మున్సిపల్​ కార్పోరేషన్​ను ప్రశ్నించింది మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్. దీనిపై సోమవారంలోగా వివరణ ఇవ్వాలని వారిని ఆదేశించింది.

Human Rights Commission pulls up BMC over Rhea's morgue visit
'రియాను ఎలా అనుమతించారు.. వివరణ ఇవ్వండి!'

దివంగత నటుడు సుశాంత్​ మృతదేహాన్ని చూడటానికి నటి రియా చక్రవర్తి.. జూన్​ 14న శవాగారానికి వచ్చిందన్న వార్తలు సోషల్​మీడియాలో చక్కర్లు కొట్టాయి. దానికి సంబంధించిన వీడియోలనూ పలు వేదికలపై షేర్​ చేశారు నెటిజన్లు. వీటిని సుమోటోగా తీసుకున్న మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ (ఎస్​హెచ్​ఆర్​సీ) ముంబయి పోలీసులు, బృహన్​ ముంబయి మున్సిపల్​ కార్పోరేషన్​కు నోటీసులు పంపింది. దీనిపై సోమవారంలోగా వివరణ ఇవ్వాలని.. ఆయా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్​హెచ్​ఆర్​సీకి చెందిన ఓ అధికారి వెల్లడించారు.

సుశాంత్​ మరణించిన జూన్​ 14న విలే పార్లేలోని కూపర్​ ఆస్పత్రికి నటి రియా వచ్చిందన్న వీడియోలను, వార్తా నివేదికలను ఎస్​హెచ్​ఆర్​సీకి చెందిన అగ్రశ్రేణి అధికారి పరిశీలించినట్లు సమాచారం. మృతదేహం వద్దకు కుటుంబసభ్యులను తప్ప మరెవరిని అనుమతించకూడదనే నిబంధనలను పట్టించుకోకపోవడంపై ఉన్నతశ్రేణి అధికారి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు సుశాంత్​ కుటుంబసభ్యులు కాని వారిని మార్చురీలోకి ఎలా అనుమతించారు? అనే విషయంపై ఆస్పత్రి డీన్​ను వివరణ కోరినట్లు తెలుస్తోంది.

సుశాంత్​ మృతదేహం మార్చురీలో ఉండగా.. నటి రియా చూడటానికి వచ్చిన వీడియోలు వైరల్​గా మారిన తర్వాత.. ఎస్​హెచ్​ఆర్​సీ గత నెలలోనే అందిన ఫిర్యాదులను సుమోటోగా తీసుకుని చర్యలు ప్రారంభించింది. మరణించిన వారికి సంబంధం లేని వ్యక్తులను శవాగారానికి అనుమతించరాదనే నిబంధనను ఉల్లంఘించిన వారంతా చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు.

దివంగత నటుడు సుశాంత్​ మృతదేహాన్ని చూడటానికి నటి రియా చక్రవర్తి.. జూన్​ 14న శవాగారానికి వచ్చిందన్న వార్తలు సోషల్​మీడియాలో చక్కర్లు కొట్టాయి. దానికి సంబంధించిన వీడియోలనూ పలు వేదికలపై షేర్​ చేశారు నెటిజన్లు. వీటిని సుమోటోగా తీసుకున్న మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ (ఎస్​హెచ్​ఆర్​సీ) ముంబయి పోలీసులు, బృహన్​ ముంబయి మున్సిపల్​ కార్పోరేషన్​కు నోటీసులు పంపింది. దీనిపై సోమవారంలోగా వివరణ ఇవ్వాలని.. ఆయా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్​హెచ్​ఆర్​సీకి చెందిన ఓ అధికారి వెల్లడించారు.

సుశాంత్​ మరణించిన జూన్​ 14న విలే పార్లేలోని కూపర్​ ఆస్పత్రికి నటి రియా వచ్చిందన్న వీడియోలను, వార్తా నివేదికలను ఎస్​హెచ్​ఆర్​సీకి చెందిన అగ్రశ్రేణి అధికారి పరిశీలించినట్లు సమాచారం. మృతదేహం వద్దకు కుటుంబసభ్యులను తప్ప మరెవరిని అనుమతించకూడదనే నిబంధనలను పట్టించుకోకపోవడంపై ఉన్నతశ్రేణి అధికారి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు సుశాంత్​ కుటుంబసభ్యులు కాని వారిని మార్చురీలోకి ఎలా అనుమతించారు? అనే విషయంపై ఆస్పత్రి డీన్​ను వివరణ కోరినట్లు తెలుస్తోంది.

సుశాంత్​ మృతదేహం మార్చురీలో ఉండగా.. నటి రియా చూడటానికి వచ్చిన వీడియోలు వైరల్​గా మారిన తర్వాత.. ఎస్​హెచ్​ఆర్​సీ గత నెలలోనే అందిన ఫిర్యాదులను సుమోటోగా తీసుకుని చర్యలు ప్రారంభించింది. మరణించిన వారికి సంబంధం లేని వ్యక్తులను శవాగారానికి అనుమతించరాదనే నిబంధనను ఉల్లంఘించిన వారంతా చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.