కరోనా లాక్డౌన్ కారణంగా తన విలువైన సమయాన్ని కుటుంబసభ్యులతో గడుపుతోంది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. ప్రస్తుతం ఆమె సొంతూరు మనాలీలో సేద తీరుతోంది. కంగనాకు వ్యక్తిగతంగా ఏ సోషల్ మీడియా ఖాతాలు లేవు. కానీ ఆమె బృందం నిర్వహించే ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో ఎప్పుడూ టచ్లో ఉంటుంది. తాజాగా కంగనా తల్లి ఆమెకు హెడ్ మసాజ్ చేస్తున్న ఫొటోను కంగనా టీమ్ ఇన్స్టాలో షేర్ చేసింది.
ఈ చిత్రం పలువురు అభిమానులను ఆకర్షించింది. ఆ ఫొటోలో కంగనా సహజంగా ఉందని నెటిజన్లు కొనియాడుతున్నారు. కొంతమంది ఆమెను మెచ్చుకుంటూ సందేశాలు పంపారు.
ప్రపంచమంతా ఎదుర్కొంటున్న కరోనా మహమ్మారిపై ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కంగనా. దేశాలన్నీ ఒకదానిపై ఒకటి ఆధిపత్యాన్ని కొనసాగించటానికి ప్రయత్నిస్తున్న చర్యను 'బయోవార్'గా ఆమె అభివర్ణించింది.
కంగనా రనౌత్.. ప్రస్తుతం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి', 'ధాకడ్', 'తేజస్' చిత్రాల్లో నటిస్తోంది. తేజస్ సినిమాలో వైమానిక దళ సభ్యురాలి పాత్ర పోషిస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి.. చిరంజీవి, నాగార్జునను ప్రశంసిస్తూ ప్రధాని ట్వీట్