ముంబయిని పాక్ ఆక్రమిత కశ్మీర్తో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. బుధవారం అదే నగరానికి చేరుకుంది. అయితే నిబంధనల ప్రకారం ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్తే 14 రోజులు క్వారంటైన్లో ఉండాలి. కానీ ఈ విషయంలో కంగనకు మినహాయింపు ఇచ్చినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
ముంబయిలో కంగన కొన్నిరోజులు మాత్రమే ఉండేందుకు వచ్చినట్లు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టారని, దీంతో ఆమెకు 'షార్ట్ టెర్మ్ విజిటర్ కేటగిరీ'లో భాగంగా మినహాయింపు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సెప్టెంబరు 14న హిమాచల్ ప్రదేశ్కు తిరుగు ప్రయాణం కానుందీ నటి.
అంతకు ముందు ముంబయిలోని కంగనా నివాసానికి మంగళవారం నోటీసులు జారీ చేసిన బీఎమ్సీ అధికారులు.. బుధవారం దానిని పాక్షికంగా కూల్చివేశారు. దీంతో కంగన హైకోర్టుకు వెళ్లగా, న్యాయస్థానం అక్రమ నిర్మాణం కూల్చివేత విషయంపై స్టే ఇచ్చింది.
ఇవీ చదవండి: