ETV Bharat / sitara

'సుప్రీమ్​' హీరో సినిమాపై మెగాస్టార్​.. రష్మిక బాలీవుడ్​ ఎంట్రీ

author img

By

Published : Dec 23, 2020, 2:38 PM IST

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'సోలో బ్రతుకే సో బెటర్', 'శశి', 'మిషన్​ మజ్ను'తో పాటు పలు చిత్రాల సంగతులు ఉన్నాయి.

Chiranjeevi makes a statement on 'Solo Brathuke So Better'
'సుప్రీమ్​' హీరో సినిమాపై మెగాస్టార్​.. రష్మిక బాలీవుడ్​ ఎంట్రీ
  • సుప్రీమ్​ హీరో సాయితేజ్​ నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్​' చిత్రం క్రిస్మస్​ సందర్భంగా డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆ చిత్రబృందానికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. లాక్​డౌన్​ తర్వాత విడుదల కాబోతున్న మొదటి సినిమా ఇదే కావడం వల్ల ఇదొక ముఖ్యమైన సందర్భంగా ప్రస్తావించారు. థియేటర్​కు వెళ్లే ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్క్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చిత్రానికి సుబ్బు దర్శకత్వం వహించగా.. తమన్​ సంగీతాన్ని అందించారు.
  • హీరో ఆది సాయికుమార్​ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన 'శశి' చిత్ర టీజర్​ను మెగాస్టార్​ చిరంజీవి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కథానాయకుడు సాయికుమార్​, అతని కుమారుడు అదితో పాటు చిరును మర్యాదపూర్వకంగా కలిశారు.
  • 'మిషన్​ మజ్ను' చిత్రం ద్వారా బాలీవుడ్​లో ఎంట్రీ ఇవ్వబోతోంది స్టార్​ హీరోయిన్​ రష్మిక. ఆమె నటించిన తొలి చిత్ర ఫస్ట్​లుక్​ను బుధవారం విడుదల చేశారు. స్పై థ్రిల్లర్​గా రూపొందుతోన్న ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్​ మల్హోత్రా సరసన రష్మిక నటిస్తోంది. ఆర్​ఎస్​వీపీ మూవీస్​ పతాకంపై రోనీ స్కూవాలా నిర్మిస్తున్నారు.
  • రామ్​ గోపాల్​ వర్మ దర్శకత్వంలో రూపొందిన కొత్త చిత్రం '12 ఓ క్లాక్: అందర్​ కా భూత్'. హారర్​ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జనవరి 8న విడుదల చేయనున్నట్లు ట్విట్టర్​లో ఆర్జీవీ ప్రకటించారు. బుధవారం ఈ చిత్ర టీజర్​ను రిలీజ్​ చేశారు.
    Chiranjeevi makes a statement on 'Solo Brathuke So Better'
    మెగాస్టార్​ చిరంజీవిని మర్యాద పూర్వకంగా కలిసిన సాయికుమార్​, ఆది
    Chiranjeevi makes a statement on 'Solo Brathuke So Better'
    మెగాస్టార్​ చిరంజీవిని మర్యాద పూర్వకంగా కలిసిన సాయికుమార్​, ఆది
    Chiranjeevi makes a statement on 'Solo Brathuke So Better'
    'మిషన్​ మజ్ను' ఫస్ట్​లుక్​

  • సుప్రీమ్​ హీరో సాయితేజ్​ నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్​' చిత్రం క్రిస్మస్​ సందర్భంగా డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆ చిత్రబృందానికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. లాక్​డౌన్​ తర్వాత విడుదల కాబోతున్న మొదటి సినిమా ఇదే కావడం వల్ల ఇదొక ముఖ్యమైన సందర్భంగా ప్రస్తావించారు. థియేటర్​కు వెళ్లే ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్క్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చిత్రానికి సుబ్బు దర్శకత్వం వహించగా.. తమన్​ సంగీతాన్ని అందించారు.
  • హీరో ఆది సాయికుమార్​ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన 'శశి' చిత్ర టీజర్​ను మెగాస్టార్​ చిరంజీవి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కథానాయకుడు సాయికుమార్​, అతని కుమారుడు అదితో పాటు చిరును మర్యాదపూర్వకంగా కలిశారు.
  • 'మిషన్​ మజ్ను' చిత్రం ద్వారా బాలీవుడ్​లో ఎంట్రీ ఇవ్వబోతోంది స్టార్​ హీరోయిన్​ రష్మిక. ఆమె నటించిన తొలి చిత్ర ఫస్ట్​లుక్​ను బుధవారం విడుదల చేశారు. స్పై థ్రిల్లర్​గా రూపొందుతోన్న ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్​ మల్హోత్రా సరసన రష్మిక నటిస్తోంది. ఆర్​ఎస్​వీపీ మూవీస్​ పతాకంపై రోనీ స్కూవాలా నిర్మిస్తున్నారు.
  • రామ్​ గోపాల్​ వర్మ దర్శకత్వంలో రూపొందిన కొత్త చిత్రం '12 ఓ క్లాక్: అందర్​ కా భూత్'. హారర్​ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జనవరి 8న విడుదల చేయనున్నట్లు ట్విట్టర్​లో ఆర్జీవీ ప్రకటించారు. బుధవారం ఈ చిత్ర టీజర్​ను రిలీజ్​ చేశారు.
    Chiranjeevi makes a statement on 'Solo Brathuke So Better'
    మెగాస్టార్​ చిరంజీవిని మర్యాద పూర్వకంగా కలిసిన సాయికుమార్​, ఆది
    Chiranjeevi makes a statement on 'Solo Brathuke So Better'
    మెగాస్టార్​ చిరంజీవిని మర్యాద పూర్వకంగా కలిసిన సాయికుమార్​, ఆది
    Chiranjeevi makes a statement on 'Solo Brathuke So Better'
    'మిషన్​ మజ్ను' ఫస్ట్​లుక్​

ఇదీ చూడండి: మెగాస్టార్​తో మంచు విష్ణు.. రైతులకు శర్వా శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.