ETV Bharat / sitara

'ఓటీటీలు థియేటర్లకు ప్రత్యామ్నాయం కాదు' - అనుష్క శర్మ న్యూస్​

ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్​లు థియేటర్లకు ప్రత్యామ్నాయం కాదని అంటోంది బాలీవుడ్​ నటి అనుష్క శర్మ. ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్​ వేదికలు ప్రేక్షకులకు చేరువైనా... సినిమా హాళ్లలో చూసిన అనుభూతిని వారు పొందలేరని తెలిపింది. అయితే ఓటీటీలు భవిష్యత్తులో ఓ కొత్త తరాన్ని సృష్టిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసిందీ హిందీ నటి.

Anushka Sharma: Nothing can substitute experience of watching film on big screen
'ఓటీటీల్లో థియేటర్ల అనుభూతి రాదు'
author img

By

Published : Jun 21, 2020, 6:47 PM IST

ప్రస్తుతం సినిమాలపై ఓటీటీల ప్రభావం ఎక్కువైనా.. థియేటర్లలో సినిమాలను చూసిన అనుభూతి వాటితో రాదని అభిప్రాయపడుతోంది బాలీవుడ్​ నటి అనుష్క శర్మ. కరోనా కారణంగా ఆన్​లైన్​ ఫ్లాట్​ఫామ్​ల హవా పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది.

"ఓటీటీ ప్లాట్​ఫామ్​లు ఎప్పటి నుంచో ఉన్నా.. తాజా పరిస్థితుల్లో వాటికి మంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకులకు బాగా చేరువై.. వారి నుంచి మంచి ప్రశంసలనూ అందుకుంటున్నాయి. ఇవి థియేటర్లపై కొంత ప్రభావాన్ని చూపగలవు. కానీ ప్రత్యామ్యాయాలు అవుతాయని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే సినిమాహాళ్లలో చూసిన అనుభూతి ఓటీటీలతో రాదు. బిగ్​ స్క్రీన్​ ద్వారానే ప్రజలు నిజమైన అనుభూతి పొందుతారు. అయితే ఈ డిజిటల్​ వేదికలు రానున్న రోజుల్లో థియేటర్లకు పోటీగా ఓ కొత్త తరంగా మారతాయి".

- అనుష్కశర్మ, బాలీవుడ్​ నటి

Anushka Sharma: Nothing can substitute experience of watching film on big screen
అనుష్క శర్మ

'క్లీన్​ స్లేట్​ ఫిలింస్​' అనే నిర్మాణ సంస్థను తన సోదరుడు కర్నేష్​ శర్మతో కలిసి ప్రారంభించిన నటి అనుష్క శర్మ.. కొన్ని సినిమాలను నిర్మించింది. 'ఎన్​హెచ్​ 10', 'పారి', 'ఫిలౌరి' సినిమాలతో పాటు 'పాతాళ్​ లోక్​' అనే వెబ్​సిరీస్​కు నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ఈ వెబ్​సిరీస్​ ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి విశేషాదరణ పొందుతోంది.

ఇదీ చూడండి... 'నాన్నకు ప్రేమతో': బాలీవుడ్​ తారల పోస్టులు

ప్రస్తుతం సినిమాలపై ఓటీటీల ప్రభావం ఎక్కువైనా.. థియేటర్లలో సినిమాలను చూసిన అనుభూతి వాటితో రాదని అభిప్రాయపడుతోంది బాలీవుడ్​ నటి అనుష్క శర్మ. కరోనా కారణంగా ఆన్​లైన్​ ఫ్లాట్​ఫామ్​ల హవా పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది.

"ఓటీటీ ప్లాట్​ఫామ్​లు ఎప్పటి నుంచో ఉన్నా.. తాజా పరిస్థితుల్లో వాటికి మంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకులకు బాగా చేరువై.. వారి నుంచి మంచి ప్రశంసలనూ అందుకుంటున్నాయి. ఇవి థియేటర్లపై కొంత ప్రభావాన్ని చూపగలవు. కానీ ప్రత్యామ్యాయాలు అవుతాయని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే సినిమాహాళ్లలో చూసిన అనుభూతి ఓటీటీలతో రాదు. బిగ్​ స్క్రీన్​ ద్వారానే ప్రజలు నిజమైన అనుభూతి పొందుతారు. అయితే ఈ డిజిటల్​ వేదికలు రానున్న రోజుల్లో థియేటర్లకు పోటీగా ఓ కొత్త తరంగా మారతాయి".

- అనుష్కశర్మ, బాలీవుడ్​ నటి

Anushka Sharma: Nothing can substitute experience of watching film on big screen
అనుష్క శర్మ

'క్లీన్​ స్లేట్​ ఫిలింస్​' అనే నిర్మాణ సంస్థను తన సోదరుడు కర్నేష్​ శర్మతో కలిసి ప్రారంభించిన నటి అనుష్క శర్మ.. కొన్ని సినిమాలను నిర్మించింది. 'ఎన్​హెచ్​ 10', 'పారి', 'ఫిలౌరి' సినిమాలతో పాటు 'పాతాళ్​ లోక్​' అనే వెబ్​సిరీస్​కు నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ఈ వెబ్​సిరీస్​ ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి విశేషాదరణ పొందుతోంది.

ఇదీ చూడండి... 'నాన్నకు ప్రేమతో': బాలీవుడ్​ తారల పోస్టులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.