స్టార్ హీరోయిన్ అనుష్క, యువ నటుడు నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో ఓ కొత్త సినిమా రూపొందుతోందని సమాచారం. ఈ సినిమాకు పి.మహేశ్ బాబు దర్శకుడు. ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కుతోందని తెలిసింది. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.
కాగా, నవీన్ పోలిశెట్టి నటించిన 'జాతి రత్నాలు' సినిమా మార్చి 11న విడుదల కానుంది. అనుష్క.. ఇటీవల 'నిశబ్దం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇదీ చూడండి: ట్రైలర్తో 'జాతిరత్నాలు' .. సాంగ్తో 'రంగ్దే'