ETV Bharat / sitara

షూటింగ్​ కోసం లండన్​కు అక్షయ్​కుమార్?

author img

By

Published : Jun 9, 2020, 9:08 AM IST

కరోనా లాక్​డౌన్​ తర్వాత తొలిసారి కెమెరా ముందుకొచ్చిన నటుడిగా ఘనత సాధించిన అక్షయ్​.. ప్రస్తుతం తన కొత్త సినిమా 'బెల్​ బాటమ్​' షూటింగ్​కు సన్నాహాలు చేస్తున్నారు. లండన్​లో జులై నుంచి చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దీనికి సంబంధించిన ముందస్తు ప్రణాళికను ఆ చిత్రబృందం సిద్ధం చేస్తుందట.

Akshay Kumar to jet off to London for Bell Bottom shoot?
జులై నుంచి లండన్​లో 'బెల్​ బోటమ్​' షూటింగ్​!

మహారాష్ట్రలో చిత్రీకరణ​లకు అనుమతినిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటన చేసింది. కంటైన్​మెంట్​ జోన్లు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో టీవీ, సినిమాలకు సంబంధించిన షూటింగ్​లు చేసుకోవచ్చని తెలిపింది. ఈ క్రమంలో షూటింగ్​లను పునఃప్రారంభించే వారిలో బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​ కుమార్​ ముందున్నారు.

అక్షయ్​.. ప్రస్తుతం నటిస్తున్న 'బెల్​ బాటమ్​' చిత్రీకరణను జులై నుంచి లండన్​లో ప్రారంభించనున్నారని సమాచారం. దీనికి సంబంధించిన ముందస్తు ప్రణాళికను ఆ చిత్రబృందం సిద్ధం చేస్తుందట. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా షూటింగ్​ను జరపనున్నారని తెలుస్తోంది. బాలీవుడ్​ వర్గాల సమాచారం మేరకు జులై నుంచి లండన్​లో షూటింగ్​ ప్రారంభిచనున్నారు. ఈ సినిమాకు రంజిత్​ తివారి దర్శకత్వం వహించగా.. నిఖిల్​ అడ్వాణీ, వషు భగ్నాని నిర్మిస్తున్నారు.

అత్యధికంగా ఆర్జిస్తున్న నటుడు

ఈ ఏడాది అత్యధికంగా సంపాదించిన సెలబ్రెటీల్లో టాప్​ 100లో చోటు సాధించారు నటుడు అక్షయ్​ కుమార్. దాదాపు రూ.366 కోట్లతో బాలీవుడ్​లో ఎక్కువ ఆర్జిస్తున్న హీరోగా జాబితో చోటు సంపాదించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాబితాలో అక్షయ్​ 52వ స్థానాన్ని దక్కించుకోగా.. హాలీవుడ్​ స్టార్​ నటులు విల్​ స్మిత్​ 69, ఏంజెలీనా జోలీ 99వ ర్యాంక్​లో ఉన్నారు.

అక్షయ్​ నటించిన 'కేసరి', 'మిషన్​ మంగళ్​', 'హౌస్ ఫుల్​ 4', 'గుడ్​ న్యూస్​' సినిమాలు గతేడాది విడుదలై బాక్సాఫీస్​ వద్ద ఘనవిజయాన్ని సాధించాయి. ఆయన ప్రస్తుతం 'లక్ష్మీ బాంబ్'​, 'సూర్య వంశీ', 'పృథ్వీరాజ్', 'అత్రాంగి రే' చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి... పెంగ్విన్ టీజర్: కుమారుడి ఆచూకీ కోసం ఓ తల్లి వేదన

మహారాష్ట్రలో చిత్రీకరణ​లకు అనుమతినిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటన చేసింది. కంటైన్​మెంట్​ జోన్లు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో టీవీ, సినిమాలకు సంబంధించిన షూటింగ్​లు చేసుకోవచ్చని తెలిపింది. ఈ క్రమంలో షూటింగ్​లను పునఃప్రారంభించే వారిలో బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​ కుమార్​ ముందున్నారు.

అక్షయ్​.. ప్రస్తుతం నటిస్తున్న 'బెల్​ బాటమ్​' చిత్రీకరణను జులై నుంచి లండన్​లో ప్రారంభించనున్నారని సమాచారం. దీనికి సంబంధించిన ముందస్తు ప్రణాళికను ఆ చిత్రబృందం సిద్ధం చేస్తుందట. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా షూటింగ్​ను జరపనున్నారని తెలుస్తోంది. బాలీవుడ్​ వర్గాల సమాచారం మేరకు జులై నుంచి లండన్​లో షూటింగ్​ ప్రారంభిచనున్నారు. ఈ సినిమాకు రంజిత్​ తివారి దర్శకత్వం వహించగా.. నిఖిల్​ అడ్వాణీ, వషు భగ్నాని నిర్మిస్తున్నారు.

అత్యధికంగా ఆర్జిస్తున్న నటుడు

ఈ ఏడాది అత్యధికంగా సంపాదించిన సెలబ్రెటీల్లో టాప్​ 100లో చోటు సాధించారు నటుడు అక్షయ్​ కుమార్. దాదాపు రూ.366 కోట్లతో బాలీవుడ్​లో ఎక్కువ ఆర్జిస్తున్న హీరోగా జాబితో చోటు సంపాదించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాబితాలో అక్షయ్​ 52వ స్థానాన్ని దక్కించుకోగా.. హాలీవుడ్​ స్టార్​ నటులు విల్​ స్మిత్​ 69, ఏంజెలీనా జోలీ 99వ ర్యాంక్​లో ఉన్నారు.

అక్షయ్​ నటించిన 'కేసరి', 'మిషన్​ మంగళ్​', 'హౌస్ ఫుల్​ 4', 'గుడ్​ న్యూస్​' సినిమాలు గతేడాది విడుదలై బాక్సాఫీస్​ వద్ద ఘనవిజయాన్ని సాధించాయి. ఆయన ప్రస్తుతం 'లక్ష్మీ బాంబ్'​, 'సూర్య వంశీ', 'పృథ్వీరాజ్', 'అత్రాంగి రే' చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి... పెంగ్విన్ టీజర్: కుమారుడి ఆచూకీ కోసం ఓ తల్లి వేదన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.