ETV Bharat / sitara

'షాడో' వెబ్​సిరీస్​లో రానా, అల్లరి నరేశ్​!

author img

By

Published : Jul 9, 2020, 10:22 PM IST

టాలీవుడ్​ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్​టైన్మెంట్స్​ ఓటీటీ ఫ్లాట్​ఫామ్​లో అడుగుపెట్టబోతోంది. మధు బాబు రచించిన నవల ఆధారంగా 'షాడో' వెబ్​ సిరీస్​ను రూపొందించనుంది . ఇందులో నటించడానికి ప్రముఖ టాలీవుడ్​ నటులు రానా, అల్లరి నరేశ్​లను సంప్రదించినట్లు సమాచారం.

AK Entertainments in talks with two heroes for their web series
'షాడో' వెబ్​సిరీస్​లో రానా, అల్లరి నరేశ్​!

ప్రముఖ నిర్మాణసంస్థ ఏకే ఎంటర్​టైన్మెంట్స్​ ఓ వెబ్​సిరీస్​ను రూపొందించబోతోంది. రచయిత మధు బాబు రాసిన నవల ఆధారంగా 'షాడో' అనే వెబ్​సిరీస్​ను నిర్మించనున్నట్లు ఇటీవలే ప్రకటన చేసింది.

ఈ వెబ్​సిరీస్​లో రెండు కీలక పాత్రల కోసం అల్లరి నరేశ్​, రానా దగ్గుపాటిలను నిర్మాణ సంస్థ సంప్రదించిందని సమాచారం. అయితే ఇందులో నటించడానికి వారిద్దరూ అంగీకరిస్తారా లేదా అనే విషయంపై స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ప్రి-ప్రొడక్షన్​ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుపై పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.

ఇదీ చూడండి... మిచెల్ ఒబామా, మెగన్ మార్కెలతో ప్రియాంక చోప్రా

ప్రముఖ నిర్మాణసంస్థ ఏకే ఎంటర్​టైన్మెంట్స్​ ఓ వెబ్​సిరీస్​ను రూపొందించబోతోంది. రచయిత మధు బాబు రాసిన నవల ఆధారంగా 'షాడో' అనే వెబ్​సిరీస్​ను నిర్మించనున్నట్లు ఇటీవలే ప్రకటన చేసింది.

ఈ వెబ్​సిరీస్​లో రెండు కీలక పాత్రల కోసం అల్లరి నరేశ్​, రానా దగ్గుపాటిలను నిర్మాణ సంస్థ సంప్రదించిందని సమాచారం. అయితే ఇందులో నటించడానికి వారిద్దరూ అంగీకరిస్తారా లేదా అనే విషయంపై స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ప్రి-ప్రొడక్షన్​ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుపై పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.

ఇదీ చూడండి... మిచెల్ ఒబామా, మెగన్ మార్కెలతో ప్రియాంక చోప్రా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.