ETV Bharat / sitara

దీపావళి పండగకు అమితాబ్​ కుటుంబం దూరం - దీపావళి అమితాబ్​ బచ్చన్​

వైరస్​ వ్యాప్తి ఇంకా తగ్గకపోవడం వల్ల ఈసారి దీపావళి వేడుకలను జరపడం లేదని అమితాబ్ తనయుడు అభిషేక్ తెలిపారు. ప్రస్తుతం భౌతిక దూరమే మన ఆయుధమని అన్నారు.

Abhishek Bachchan talks about not hosting a Diwali party this year: Who hosts parties at a time like this?
కరోనా కలవరం.. పండుగకు అమితాబ్​ ఫ్యామిలీ దూరం.
author img

By

Published : Nov 8, 2020, 10:00 AM IST

బిగ్​బీ​ అమితాబ్​ బచ్చన్​ ఇంట్లో జరిగే దీపావళి వేడుకను ఈసారి కరోనా దూరం చేసేసింది. ప్రతి ఏటా నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు హాజరవుతారు. అయితే.. ఈసారి వైరస్ ప్రభావమున్న దృష్ట్యా పండగకు దూరంగా ఉండనున్నారు. ఈ విషయాన్ని అమితాబ్​ కుమారుడు అభిషేక్​ ధ్రువీకరించారు. తమ బంధువుల్లో ఒకరు చనిపోవడం కూడా వీటిని జరపకపోవడానికి కారణమని చెప్పారు. అభిషేక్ సోదరి శ్వేత అత్తయ్య ఇటీవలే మృతి మరణించారు.

"మా కుటుంబంలో మేం ఒకరిని కోల్పోయాం. దానికి తోడు కరోనా కలవరం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎవరైనా వేడుకలను ఎలా చేసుకోగలరు. ఇప్పుడు భౌతిక దూరమే మన ఆయుధం. కానీ, అది కూడా వైరస్​ సోకకుండా కాపాడుతుందన్న నమ్మకం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో దీపావళి లాంటి పండగలు జరుపుకోవడం కష్టమే"

-- అభిషేక్ బచ్చన్​, నటుడు

అమితాబ్​ కుటుంబంలో జయా బచ్చన్​ మినహా అందరూ కొన్నాళ్ల క్రితం కరోనా బారినపడి ఆసుపత్రిలో చికిత్స చేసుకున్నారు. అందువల్ల వారంతా వైరస్​ను కట్టడి చేసేందుకు అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:రెండు రూపాయల కోసం ఇబ్బందిపడిన అమితాబ్​

బిగ్​బీ​ అమితాబ్​ బచ్చన్​ ఇంట్లో జరిగే దీపావళి వేడుకను ఈసారి కరోనా దూరం చేసేసింది. ప్రతి ఏటా నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు హాజరవుతారు. అయితే.. ఈసారి వైరస్ ప్రభావమున్న దృష్ట్యా పండగకు దూరంగా ఉండనున్నారు. ఈ విషయాన్ని అమితాబ్​ కుమారుడు అభిషేక్​ ధ్రువీకరించారు. తమ బంధువుల్లో ఒకరు చనిపోవడం కూడా వీటిని జరపకపోవడానికి కారణమని చెప్పారు. అభిషేక్ సోదరి శ్వేత అత్తయ్య ఇటీవలే మృతి మరణించారు.

"మా కుటుంబంలో మేం ఒకరిని కోల్పోయాం. దానికి తోడు కరోనా కలవరం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎవరైనా వేడుకలను ఎలా చేసుకోగలరు. ఇప్పుడు భౌతిక దూరమే మన ఆయుధం. కానీ, అది కూడా వైరస్​ సోకకుండా కాపాడుతుందన్న నమ్మకం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో దీపావళి లాంటి పండగలు జరుపుకోవడం కష్టమే"

-- అభిషేక్ బచ్చన్​, నటుడు

అమితాబ్​ కుటుంబంలో జయా బచ్చన్​ మినహా అందరూ కొన్నాళ్ల క్రితం కరోనా బారినపడి ఆసుపత్రిలో చికిత్స చేసుకున్నారు. అందువల్ల వారంతా వైరస్​ను కట్టడి చేసేందుకు అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:రెండు రూపాయల కోసం ఇబ్బందిపడిన అమితాబ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.