ETV Bharat / science-and-technology

నాసా ఆర్టెమిస్- 1 ప్రయోగం సక్సెస్.. క్షేమంగా భూమికి ఒరాయన్‌

author img

By

Published : Dec 12, 2022, 6:32 AM IST

చంద్రుడిపైకి మనుషులను తీసుకెళ్లే సన్నాహాల్లో భాగంగా నాసా చేపట్టిన ఆర్టెమిస్-1 యాత్ర విజయవంతమైంది. నవంబరు 16న నింగిలోకి దూసుకెళ్లిన ఒరాయన్‌ క్యాప్సూల్.. తిరిగి భూమిని చేరింది.

NASA Artemis 1 Orion splashdown
NASA Artemis 1 Orion splashdown

మనుషులను తిరిగి చందమామ వద్దకు తీసుకెళ్లే సన్నాహాల్లో భాగంగా అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా చేపట్టిన మానవరహిత ఆర్టెమిస్‌-1 యాత్ర దిగ్విజయంగా పూర్తయింది. ఈ ప్రాజెక్టులో భాగంగా పయనమైన ఒరాయన్‌ క్యాప్సూల్‌.. జాబిల్లిని చుట్టి, అనుకున్న రీతిలో ఆదివారం క్షేమంగా భూమికి తిరిగొచ్చింది. అపోలో-17 పేరిట చివరిసారిగా మానవులు చంద్రుడిపై కాలుమోపి 50 ఏళ్లు పూర్తయిన రోజునే ఈ పరిణామం జరగడం విశేషం. ఆర్టెమిస్‌-1ను నాసా ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఒరాయన్‌.. మానవులను చంద్రుడిపైకి చేరవేసి, తిరిగి సురక్షితంగా భూమికి తీసుకురాగలదా అన్నది పరీక్షించడం దీని ఉద్దేశం. అందువల్ల ఈ దఫా ఆ క్యాప్సూల్‌లో మానవులకు బదులు మూడు డమ్మీలను ఏర్పాటు చేశారు. అందులో వివిధరకాల డేటా సేకరణకు సెన్సర్లను ఏర్పాటు చేశారు.

  • ఒరాయన్‌ను నవంబరు 16న నింగిలోకి పంపారు. శక్తిమంతమైన స్పేస్‌ లాంచ్‌ సిస్టమ్‌ (ఎస్‌ఎల్‌ఎస్‌) రాకెట్‌పైన దీన్ని ఉంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు.
  • అనంతరం ఎస్‌ఎల్‌ఎస్‌ నుంచి విడిపోయిన ఒరాయన్‌.. చంద్రుడి దిశగా పయనాన్ని ఆరంభించింది. నవంబరు 25న జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది. డిసెంబర్‌ 1న బయటకు వచ్చేసింది. ఈ క్రమంలో చందమామ ఉపరితలానికి 127 కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లింది.
  • కొద్దిరోజుల కిందట ఒరాయన్‌ ప్రధాన ఇంజిన్‌ను 3.5 నిమిషాల పాటు మండించడం ద్వారా దాన్ని భూమి దిశగా తిరుగుప్రయాణానికి సన్నద్ధం చేశారు. ఆదివారం రాత్రి ఈ క్యాప్సూల్‌.. గంటకు 39,400 కిలోమీటర్ల వేగంతో భూవాతావరణంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో వాతావరణ రాపిడి వల్ల దాదాపు 3వేల డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను ఒరాయన్‌ ఎదుర్కొంది.
  • వ్యోమనౌకకు ఏర్పాటు చేసిన ఉష్ణ కవచం ఈ వేడి నుంచి రక్షించింది. అనంతరం పారాచూట్లు క్రమపద్ధతిలో విచ్చుకొని, ఒరాయన్‌ వేగాన్ని తగ్గించాయి. అంతిమంగా వేగం గంటకు 30 కిలోమీటర్లకు తగ్గింది.
  • మెక్సికోకు చెందిన గ్వాడాలూప్‌ దీవి సమీపాన పసిఫిక్‌ మహాసముద్రంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11.10 గంటలకు ఈ వ్యోమనౌక దిగింది. మొత్తం మీద ఒరాయన్‌.. 14 లక్షల మైళ్లు ప్రయాణించింది. పుడమి నుంచి 4.32 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్లింది. మానవ రవాణా యోగ్యత ఉన్న ఒక వ్యోమనౌక ఇంత దూరం వెళ్లడం ఇదే మొదటిసారి.

ఇక మానవసహిత యాత్రలే..
2024లో చేపట్టే అర్టెమిస్‌-2 యాత్రలో వ్యోమగాములను పంపుతారు. అయితే వారు చంద్రుడిపై దిగరు. జాబిల్లిని చుట్టి వస్తారు. 2025లో నిర్వహించే ఆర్టెమిస్‌-3 యాత్రలో భాగంగా వెళ్లే వ్యోమగాములు చంద్రుడి దక్షిణ ధృవంపై కాలుమోపుతారు.

మనుషులను తిరిగి చందమామ వద్దకు తీసుకెళ్లే సన్నాహాల్లో భాగంగా అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా చేపట్టిన మానవరహిత ఆర్టెమిస్‌-1 యాత్ర దిగ్విజయంగా పూర్తయింది. ఈ ప్రాజెక్టులో భాగంగా పయనమైన ఒరాయన్‌ క్యాప్సూల్‌.. జాబిల్లిని చుట్టి, అనుకున్న రీతిలో ఆదివారం క్షేమంగా భూమికి తిరిగొచ్చింది. అపోలో-17 పేరిట చివరిసారిగా మానవులు చంద్రుడిపై కాలుమోపి 50 ఏళ్లు పూర్తయిన రోజునే ఈ పరిణామం జరగడం విశేషం. ఆర్టెమిస్‌-1ను నాసా ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఒరాయన్‌.. మానవులను చంద్రుడిపైకి చేరవేసి, తిరిగి సురక్షితంగా భూమికి తీసుకురాగలదా అన్నది పరీక్షించడం దీని ఉద్దేశం. అందువల్ల ఈ దఫా ఆ క్యాప్సూల్‌లో మానవులకు బదులు మూడు డమ్మీలను ఏర్పాటు చేశారు. అందులో వివిధరకాల డేటా సేకరణకు సెన్సర్లను ఏర్పాటు చేశారు.

  • ఒరాయన్‌ను నవంబరు 16న నింగిలోకి పంపారు. శక్తిమంతమైన స్పేస్‌ లాంచ్‌ సిస్టమ్‌ (ఎస్‌ఎల్‌ఎస్‌) రాకెట్‌పైన దీన్ని ఉంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు.
  • అనంతరం ఎస్‌ఎల్‌ఎస్‌ నుంచి విడిపోయిన ఒరాయన్‌.. చంద్రుడి దిశగా పయనాన్ని ఆరంభించింది. నవంబరు 25న జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది. డిసెంబర్‌ 1న బయటకు వచ్చేసింది. ఈ క్రమంలో చందమామ ఉపరితలానికి 127 కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లింది.
  • కొద్దిరోజుల కిందట ఒరాయన్‌ ప్రధాన ఇంజిన్‌ను 3.5 నిమిషాల పాటు మండించడం ద్వారా దాన్ని భూమి దిశగా తిరుగుప్రయాణానికి సన్నద్ధం చేశారు. ఆదివారం రాత్రి ఈ క్యాప్సూల్‌.. గంటకు 39,400 కిలోమీటర్ల వేగంతో భూవాతావరణంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో వాతావరణ రాపిడి వల్ల దాదాపు 3వేల డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను ఒరాయన్‌ ఎదుర్కొంది.
  • వ్యోమనౌకకు ఏర్పాటు చేసిన ఉష్ణ కవచం ఈ వేడి నుంచి రక్షించింది. అనంతరం పారాచూట్లు క్రమపద్ధతిలో విచ్చుకొని, ఒరాయన్‌ వేగాన్ని తగ్గించాయి. అంతిమంగా వేగం గంటకు 30 కిలోమీటర్లకు తగ్గింది.
  • మెక్సికోకు చెందిన గ్వాడాలూప్‌ దీవి సమీపాన పసిఫిక్‌ మహాసముద్రంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11.10 గంటలకు ఈ వ్యోమనౌక దిగింది. మొత్తం మీద ఒరాయన్‌.. 14 లక్షల మైళ్లు ప్రయాణించింది. పుడమి నుంచి 4.32 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్లింది. మానవ రవాణా యోగ్యత ఉన్న ఒక వ్యోమనౌక ఇంత దూరం వెళ్లడం ఇదే మొదటిసారి.

ఇక మానవసహిత యాత్రలే..
2024లో చేపట్టే అర్టెమిస్‌-2 యాత్రలో వ్యోమగాములను పంపుతారు. అయితే వారు చంద్రుడిపై దిగరు. జాబిల్లిని చుట్టి వస్తారు. 2025లో నిర్వహించే ఆర్టెమిస్‌-3 యాత్రలో భాగంగా వెళ్లే వ్యోమగాములు చంద్రుడి దక్షిణ ధృవంపై కాలుమోపుతారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.