పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు జేసీబీ తగలడంతో కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో చోటుచేసుకుంది. పశ్చిమ బంగాకు చెందిన దిల్వార్ అలీ అనే వ్యక్తి మరణించాడు.
సెల్ఫోన్ టవర్ తీగలు వేసేందుకు కాలువ తవ్వుతుండగా అతనికి జేసీబీ బకెట్ తగలడంతో ప్రాణాలు వదిలాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: రోడ్డు ప్రమాదం.. కారులో మాజీ క్రికెటర్ అజారుద్దీన్